Breaking News

కరోనా భయం.. చచ్చిన పామును తిన్న వ్యక్తి


కరోనా వైరస్ భయంతో జనం రకరకాల పనులు చేస్తుంటారు. కొందరు కరోనా నుంచి తమను తాము కాపాడుకోవడంకోసం వింత వింత చేష్టలకు దిగుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి కరోనాకు విరుగుడు అంటూ చచ్చిన పామును తిన్నాడు. ఈ ఘటన తమిళనాడు వాట్సాప్ గ్రూపులలో వైరల్ అయ్యింది. మధురై జిల్లా పెరుమపట్టికి చెందిన వడివేలు అనే ఓ వ్యవసాయ కూలి. యాభై ఏళ్ల వయసున్న వడివేలు ఒకరోజు చచ్చిన కట్లపామును ఒకదానిని చేతబట్టి డాన్సులేశాడు. పాము కరోనాకి విరుగుడేనంటూ.. ఇక తనకు కరోనా రాదంటూ వ్యాఖ్యలు చేస్తూ అందరూ చూస్తుండగానే దానిని నమిలి తినేశాడు. పాము కరోనాకి విరుగుడేనంటూ.. ఇక తనకు కరోనా రాదంటూ వ్యాఖ్యలు చేస్తూ అందరూ చూస్తుండగానే దానిని నమిలి తినేశాడు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి వైరల్ తీశారు. జిల్లా ఫారెస్ట్ అధికారుల దాకా ఆ వీడియో చేరడంతో సైబర్ పోలీసులను ఆశ్రయించారు. చివరికి వడివేలుని గుర్తించి అరెస్ట్ చేశారు. ఆ టైంలో అతను ఫుల్‌గా తాగి ఉన్నాడని, అదృష్టవశాత్తూ అతను విష గ్రంథిని కొరకలేదని అధికారులు వెల్లడించారు. కాగా, ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్నానని, కొందరు బలవంతం చేయించి ఆ పని చేయించారని వడివేలు వాపోతున్నాడు. కట్లపాము విషంలో న్యూరోటాక్సిన్స్ ఉంటాయని, అవి పక్షవాతాన్ని కలగజేస్తుందని ఫారెస్ట్ అధికారి ఒకరు వెల్లడించారు. కాగా, ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్నానని, కొందరు బలవంతం చేయించి ఆ పని చేయించారని వడివేలు వాపోతున్నాడు. వడివేలును అరెస్ట్ చేయడంతో పాటు 7,000 రూపాయల ఫైన్ విధించారు.


By May 28, 2021 at 02:27PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/tamilnadu-man-arrested-for-eating-snake/articleshow/83031399.cms

No comments