Breaking News

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన సీనియర్ హీరో, సూపర్ స్టార్ కృష్ణ


రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నేటికీ కొనసాగుతోంది. ఇప్పటికే ఎందరో సినీ, రాజకీయ ప్రముఖులు ఈ బృహత్తర కార్యక్రమంలో భాగమై మొక్కలు నాటారు. మొక్కలు నాటడం వల్ల భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం ప్రసాదించిన వచ్చని, ఈ కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగమై మొక్కలు నాటాల్సిందిగా పలువురు ప్రముఖులు చెప్పుకొచ్చారు. నేడు (మే 31) సూపర్ స్టార్ కృష్ణ ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. జోగినిపల్లి సంతోష్ కుమార్ ట్విట్టర్ ద్వారా తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి వారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు నానక్ రామ్ గూడా లోని తన నివాసంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు సీనియర్ హీరో, సూపర్ స్టార్ కృష్ణ. ఈ సందర్భంగా హీరో కృష్ణ మాట్లాడుతూ.. పచ్చదనాన్ని పెంచుతూ పర్యావరణాన్ని పరిరక్షించడం మన అందరిపై బాధ్యత ఉందని అన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల్లో పచ్చదనం పెంచడం కోసం చైతన్యం తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయమని అతను చేస్తున్న కృషికి నేను మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. గతంలో కూడా నేను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం జరిగింది తెలిపారు. తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు కృష్ణ.


By May 31, 2021 at 03:47PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/krishna-participated-in-green-india-challenge/articleshow/83111941.cms

No comments