Breaking News

ఒక్కరోజే 4,205 మంది మృతి... 37,04,099కి చేరిన యాక్టివ్ కేసులు


భారత్‌లో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,48,421 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా.. 4,205 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు 3,55,338 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజా కేసులతో దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,33,40,938కి చేరింది. అలాగే కోలుకున్న వారి సంఖ్య 1,93,82,642గా ఉంది. గత నాలుగు రోజుల నుంచి కొత్త కోవిడ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నా మరణాల సంఖ్య మాత్ర పెరగడం కలవరపరుస్తోంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 37,04,098 యాక్టివ్ కేసులున్నాయి. మరణాల సంఖ్య 2,54,197కి చేరింది. ఇప్పటివరకు 17,52,35,991 మంది కోవిడ్ టీకా తీసుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది.


By May 12, 2021 at 10:44AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/4205-covid-deaths-registered-within-24-hours-in-india/articleshow/82567444.cms

No comments