Breaking News

చైనా మారథాన్‌లో విషాదం: విరుచుపడిన వడగండ్ల వాన.. 21 మంది మృతి


చైనాలో నిర్వహించిన ఓ మారథాన్ విషాదంగా ముగిసింది. ప్రతికూల వాతావరణంతో ఈ మారథాన్‌లో పాల్గొన్న 21 మంది మృతి చెందారు. మరో ఎనిమిది మంది స్వల్పగాయాలతో బయటపడ్డారు. గాన్సు ప్రావిన్సుల్లో శనివారం మధ్యాహ్నం నిర్వహించిన 100 కిలోమీటర్ల మౌంటెన్ మారథాన్లో 172 పాల్గొనగా.. ఇందులో 21 మంది చనిపోయినట్టు అధికారిక మీడియా వెల్లడించింది. మరో ఎనిమిది మంది స్వల్పంగా గాయపడ్డారని, వారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రిలో చేర్పించినట్టు పేర్కొంది. మౌంటెన్ మారథాన్ బాయిన్ నగరంలోని జింగ్టాయ్ కౌంటీలోని ఓ పర్యాటక ప్రదేశంలో జరిగినట్టు జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. రేసు ప్రారంభమైన తర్వాత వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటుచేసుకోవడంతో ఈ ఘటన జరిగినట్టు వివరించింది. చైనా కాలమానం ప్రకారం.. ఉదయం 9.30 గంటల సమయానికి 21 మంది మరణించారని స్పష్టం చేసింది. ఈ ఘటనతో రేసును నిలిపివేసిన అధికారులు.. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ మారథాన్లో పాల్గొనన్న 143 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఒకరి ఆచూకీ గల్లంతుకాగా.. 20 మంది చనిపోయారని సీసీటీవీ తొలుత వెల్లడించింది. యెల్లో నది పరీవాహక ప్రాంతంలోని స్టోన్ ఫారెస్ట్ వద్ద ఈ మారథాన్ నిర్వహించారు. రేసు ప్రారంభమై 20 నుంచి 31 కిలోమీటర్లకు చేరుకోగానే అకస్మాత్తుగా వాతావరణం మారిపోయినట్టు బాయిన్ నగర మేయర్ జంగ్ జుచెన్ తెలిపారు. వడగళ్లతో భారీ గాలులు విరుచుకుపడి, ఉష్ణోగ్రత్తలు ఊహించని విధంగా పడిపోయాయని పేర్కొన్నారు. మారథాన్‌లో పాల్గొన్న కొందరు సాయం కోసం అర్ధిస్తూ మెసేజ్ చేయడంతో నిర్వహాకులు అప్రమత్తమయ్యారు. తక్షణమే రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగి పలువుర్ని రక్షించారు. మధ్యాహ్నం 2 గంటలకు పరిస్థితులు దిగజారడంతో వెంటనే మారథాన్‌ను నిలిపివేశారు. వాతావరణ కారణంగా మారథాన్‌లో పాల్గొన్నవారి శరీర ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయని వివరించారు. కొండ ప్రాంతం కావడంతో ఉష్ణోగ్రతలు రాత్రివేళ మరింత తగ్గిపోయినట్టు పేర్కొన్నారు. మంగోలియా సరిహద్దుల్లో ఉండే గన్సు ప్రావిన్సులు చైనాలోని వెనుకబడి ప్రాంతాల్లో ఒకటి.


By May 23, 2021 at 01:23PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/21-dead-who-participates-china-marathon-due-to-extreme-weather-hits/articleshow/82877444.cms

No comments