Breaking News

‘ఆచార్య’, ‘విరాటపర్వం’ సినిమాలకు షాక్.. ఆ సీన్లు ఉంటే సినిమా విడుదలను అడ్డుకుంటాం..


మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమాగా, మెస్ట్ సక్సెస్‌ఫుల్ దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘’. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌ ఓ కీలక పాత్రలోనూ నటిస్తున్నాను. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రోడక్షన్ పనులకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్, చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో ఉడుగుల వేణు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘విరాటపర్వం’. ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రియమణి, నివేదా పెతురాజ్, నందితా దాస్, నవీన్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాలకు ఓ కామన్ పాయింట్ ఉంది. ఈ సినిమాలు రెండు నక్సలైట్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్నవే. మరోవైపు కొద్దిరోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో నక్సలైట్లు దారుణానికి పాల్పడ్డారు. సీపీఆర్‌ఎఫ్ పోలీసు సిబ్బందిపై దాడికి పాల్పడిన నక్సలైట్లు.. 22 మంది ప్రాణాలను బలిగొన్నారు. ఈ ఘటన తర్వాత నక్సలైట్లపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వస్తుంది. ఈ ఎఫెక్ట్ ఇప్పుడు ఆచార్య, విరాటపర్వం సినిమాలపై కూడా పడింది. ఈ సినిమాలు రెండు నక్సలైట్ల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కినవని ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. దీంతో ఈ సినిమాల్లో నక్సలైట్లను మంచివాళ్లగా చూపించే విధంగా సన్నివేశాలు ఉంటే ఈ రెండు సినిమాలను సెన్సార్ చేయవద్దని యాంటీ టెర్రరిజం ఫోరమ్ సెన్సార్ బోర్డును కోరింది. అంతేకాక.. మున్ముందు కూడా ఇలాంటి సినిమాలు రాకుండా ఉండాలని.. అసలు అలాంటి సినిమాలను ప్రొత్సహించవద్దని ఫోరమ్ సభ్యులు అన్నారు. తమ అభ్యర్థనలను కాదని సినిమాలను విడుదల చేసే ప్రయత్నం చేస్తే.. కచ్చితంగా అడ్డుకుంటామని వాళ్లు డిమాండ్ చేశారు.


By April 10, 2021 at 02:39PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/atf-asks-censor-board-not-to-issue-certificate-for-acharya-and-virataparvam/articleshow/82003449.cms

No comments