Breaking News

ట్విట్టర్‌లో ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ.. యూవీ క్రియేషన్స్‌పై టార్గెట్.. ఇంకెన్ని రోజులు వేచిచూడాలి సామి..


బాహుబలి సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ రేంజ్ పెరిగిపోయింది. ఈ సినిమాతో నేషనల్‌ వైడ్ స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాడు డార్లింగ్.. అయితే ఆ తర్వాత ‘రన్‌ రాజా రన్’ ఫేమ్ దర్శకుడు సుజీత్ డైరక్షన్‌లో వచ్చిన ‘సాహో’ చిత్రం కాస్త నిరాశపరిచింది. ప్రస్తుతం ప్రభాస్.. ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’, ‘సలార్’ వంటి భారీ చిత్రాల్లో నటిస్తున్నాడు. బ్యానర్‌పై సినిమాని ఎప్పుడో ప్రకటించారు. కానీ, సినిమా గురించి అప్‌డేట్స్ ఇవ్వడంలో మాత్రం యూవీ క్రియేషన్స్ చాలా ఆలస్యం చేస్తుంది. ఈ సినిమా ఫస్ట్‌గ్లింప్స్‌ను వదిలిన మేకర్స్.. సినిమాని ఈ ఏడాది జూలై 30న విడుదల చేస్తున్నట్లు ప్రకటించి దాదాపు రెండు నెలలు అయింది. సినిమా షూటింగ్ కూడా పూర్తై చాలాకాలం అయింది. కానీ, ఇప్పటి వరకూ సినిమాకు సంబంధించిన మరే అప్‌డేట్ లేదు. టీజర్, ట్రైలర్, పాటల విడుదల కాదు కదా.. కనీసం ఎప్పుడు విడుదల చేస్తామనే ప్రకటన కూడా చేయడం లేదు. మరోవైపు రాధేశ్యామ్ కంటే తర్వాత తెరకెక్కిన సినిమాలు ఇప్పటికే విడుదలై.. సూపర్‌హిట్లు కూడా అయ్యాయి. కానీ, యూవీ క్రియేషన్స్ మాత్రం రాధేశ్యామ్ విషయంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ నిర్మాణ సంస్థపై మరోసారి గుర్రుమన్నారు. శుక్రవారం(ఏప్రిల్ 9న) నుంచి.. ‘నిద్రలే యూవీ క్రియేషన్స్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ని ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. నిర్మాణ సంస్థ నుంచి అప్‌డేట్ వచ్చే వరకూ ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందని వాళ్లు అంటున్నారు. గోపీచంద్ హీరోగా నటించిన ‘జిల్’ సినిమా ఫేమ్ రాధాకృష్ణ డైరక్షన్‌లో ‘రాధేశ్యామ్’ రూపొందింది. ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. పిరియాడికల్ లవ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. ఒక ప్రస్తుతం ప్రభాస్ రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’ అనే సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ సినిమాలో సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. ఆ తర్వాత ‘కే.జీ.ఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరక్షన్‌లో ‘సలార్’ సినిమాలో నటించనున్నాడు ప్రభాస్.


By April 10, 2021 at 01:33PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/prabhas-fans-shows-anger-on-uv-creations-about-delay-in-radhe-shyam-updates/articleshow/82002680.cms

No comments