కోట్లల్లో మోసం.. పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన నరేష్.. అసలు మ్యాటర్ ఇదే!!
టాలీవుడ్ సీనియర్ నటుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తన వ్యాపార కార్యకలాపాలు చూసుకుంటున్న ఆయన.. ఓ కంపెనీ తనను కోట్లలో మోసం చేసిందని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. కీస్టోన్ అనే కంపెనీ తనను మోసం చేసిందని పేర్కొంటూ ఆదివారం ఉదయం హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. లింగం శ్రీనివాస్ అనే వ్యక్తి కీస్టోన్ ఇన్ఫ్రా కంపెనీ పేరుతో తమ బిల్డర్స్తో ఫినిక్స్లో అసోసియేట్ అయి సైనింగ్ అథారిటీగా ఉన్నాడని, తమ కుటుంబంతో ఉన్న పరిచయంతో ఏడున్నర కోట్లు హ్యాండ్ ఫైనాన్స్ ద్వారా తీసుకొని తిరిగి ఇవ్వలేదని నరేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాదాపు 10 కోట్లకు పైగా మోసం జరిగిందని, తిరిగి చెల్లించమని అడిగినా వాళ్లు స్పందించకుండా, తప్పించుకొని తిరుగుతున్నారని నరేష్ తెలిపారు. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను కోరారు. నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. దీనిపై విచారణ జరిగి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాజా ఇష్యూతో నరేష్ మరోసారి చర్చల్లో నిలిచారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్లో తన మార్క్ చూపిస్తూ వైవిద్యభరితమైన పాత్రలతో ప్రేక్షకుల అభిమానం చూరగొన్న నరేష్.. ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ చేస్తూ నేటితరం ప్రేక్షకులను కూడా అలరిస్తున్నారు. ఇటీవలే వచ్చిన 'జాతిరత్నాలు' సినిమాలో హీరోయిన్ ఫాదర్గా నరేష్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.
By April 18, 2021 at 12:45PM
No comments