Breaking News

అసోంలో భారీ భూకంపం.. నేలమట్టమైన భవనాలు


ఈశాన్య భారతాన్ని భూకంపం వణికించింది. అస్సాంలో ఇవాళ ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.4 తీవ్రతగా నమోదైంది. ఈ విషయాన్ని అస్సాం ముఖ్యమంత్రి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. కొద్దిసేపటి క్రితం అస్సాంలో భూకంపం సంభవించిందని, సోనిత్పూర్ జిల్లాలోని దేకియాజులి కేంద్రంగా భూకంపం సంభవిచినట్టు ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. ట్విట్టర్ లో దెబ్బతిన్న భవనాలకు సంబంధించిన ఫోటోలను కూడా ఆయన పోస్ట్ చేశారు. ఈ ఉదయం 7:51 నిమిషాలకు భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. గువాహటికి 97, తేజ్‌పూర్‌కు 45, ఢేకియాజులి కిలోమీటర్ల దూరం ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు పేర్కొంది. సొనిట్‌పూర్ టౌన్ సమీపంలో భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతున ఇది సంభవించినట్లు స్పష్టం చేసింది. 6.4 తీవ్రతతో భూకంపం సంభవించడం వల్ల దాని ప్రకంపనలు రాష్ట్రం మొత్తం మీద నమోదైనట్లు సిస్మాలజీ సెంటర్ అంచనా వేసింది. ఒకవైపు కరోనా మహమ్మారి అస్సాం ను వణికిస్తున్న తరుణంలో భూకంపం సంభవిచడంతో ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు. అస్సాంలో భూకంపాలు తరచుగా వస్తూనే ఉంటాయి. కానీ, ఈ స్థాయిలో భూకంపం సంభవించడం కొంతమేర ఇబ్బందులు కలిగించే అంశంగా చెప్పాలి. ఈ నెల 5వ తేదీన సిక్కిం-నేపాల్ సరిహద్దుల్లో 5.4 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. సిక్కిం భూకంప తీవ్రత మూడు రాష్ట్రాల్లో కనిపించింది.


By April 28, 2021 at 09:51AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/6-4-earthquake-magnitude-in-assam/articleshow/82285100.cms

No comments