Breaking News

కేరళ సోలార్‌ స్కామ్.. సరితా నాయర్‌కు ఆరేళ్ల జైలుశిక్ష


రాష్ట్రాన్ని కుదిపేసిన లార్‌ ప్యానెల్‌ కుంభకోణం కేసులో దోషిగా నిర్ధారణ అయిన సరితా నాయర్‌కు కేరళ న్యాయస్థానం 6 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ మేరకు జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌–3 కె.నిమ్మి మంగళవారం తీర్పు వెలువరించారు. కేరళలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని కుదిపేసిన ఈ కుంభకోణంలో సరిత ఏ2 నిందితురాలు. మూడో నిందితుడైన బి.మణిమోన్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఏ1 నిందితుడైన బిజు రాధాకృష్ణన్‌ ప్రస్తుతం కరోనాతో క్వారంటైన్‌లో ఉండటంతో న్యాయమూర్తి అతడికి సంబంధించిన తీర్పును వాయిదా వేశారు. ఈ కేసులో మోసం సహా నాలుగు నేరాలకు పాల్పడినట్లుగా నిర్ధారించిన కోర్టు.. జైలు శిక్షలతోపాటు, రూ.10వేల చొప్పున రూ.40 వేల జరిమానా కూడా విధించింది. కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో గత వారమే పోలీసులు సరితను అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. కంపెనీ ఫ్రాంచైజీ ఇప్పించడంతో పాటు తన నివాసం, కార్యాలయాల్లో సోలార్‌ ప్యానెళ్లను అమరుస్తామంటూ సరితా నాయర్, బిజు రాధాకృష్ణన్‌ రూ.42.70 లక్షలు తీసుకుని మోసం చేశారంటూ కోజికోడ్‌కు చెందిన అబ్దుల్‌ మజీద్‌ అనే వ్యక్తి 2012లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు దిమ్మతిరిగే నిజాలు తెలిశాయి. వీరిద్దరు ఇదేవిధంగా అనేక మంది నుంచి కోట్లాది రూపాయలను వసూలు చేసి మోసం చేసినట్లు వెల్లడైంది.


By April 28, 2021 at 09:58AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/kerala-solar-scam-accused-saritha-nair-gets-6-years-jail-term-in-cheating-case/articleshow/82285428.cms

No comments