Breaking News

అమెరికా సురక్షితంగా ఉండాలంటే ఆ పని చేయండి.. బైడెన్‌కు ట్రంప్ సలహా


అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక సూచనలు చేశారు. అమెరికాను ఇస్లామిక్‌ ఉగ్రవాదం నుంచి సురక్షితంగా ఉండాలంటే పలు ముస్లిం దేశాలపై ప్రయాణ నిషేధం విధించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ట్రంప్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. డొనాల్డ్ ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ముస్లిం ఆధిపత్య దేశాలైన ఇరాన్‌, ఇరాక్‌, లిబియా, సోమాలియా, సూడాన్‌, సిరియా, యెమెన్‌‌పై ప్రయాణ నిషేధాన్ని విధించిన విషయం తెలిసిందే. కానీ బైడెన్‌ అధికారంలోకి వచ్చాక గతంలో ట్రంప్ జారీచేసిన ఆదేశాలను రద్దుచేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్ సూచనలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘‘అమెరికాను ఇస్లామిక్‌ ఉగ్రవాదం నుంచి అధ్యక్షుడు కాపాడాలనుకుంటే.. పలు ముస్లిం దేశాలపై ప్రయాణ నిషేధాన్ని పునరుద్ధరించాలి.. అలాగే, శరణార్థులకు ఆశ్రయం కల్పించే విషయంపైనా గతంలో నేను తీసుకువచ్చిన ఆంక్షల్ని అమలులోకి తేవాలి’’ అని సూచించారు. ‘‘ప్రస్తుతం ఉగ్రవాద కార్యకలాపాలు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఆన్‌లైన్‌ ద్వారా రిక్రూట్ చేసుకుంటున్నారు... ఉగ్రవాదాన్ని అమెరికా నుంచి నిర్మూలించడానికి మనం కొంత తెలివిగా పనిచేయాల్సిన అవసరం ఉంది.. ఇంగిత జ్ఞానంతో కొన్ని నిబంధనల్ని అమలులోకి తేవాలి.. ఐరోపా చేసిన ఇమ్మిగ్రేషన్‌ తప్పిదాలను మనం తిరిగి చేయకూడదు’’ అని ట్రంప్‌ తెలిపారు. ట్రంప్‌ హయాంలో ముస్లిం దేశాలైన ఇరాన్‌, ఇరాక్‌, లిబియా, సోమాలియా, సూడాన్‌, సిరియా, యెమెన్‌ దేశాలపై ప్రయాణ నిషేధాన్ని విధించిన విషయం తెలిసిందే. కానీ బైడెన్‌ అధికారంలోకి వచ్చాక ట్రంప్‌ ఆదేశాల్ని ఎత్తివేశారు. ట్రావెల్ బ్యాన్ వ్యవహారంలో డొనాల్డ్ ట్రంప్‌‌నకు అప్పట్లో న్యాయస్థానాలు మొట్టికాయలు వేశాయి. అమెరికాలోకి ప్రవేశించకుండా 6 ముస్లిం దేశాల ప్రయాణికులపై ట్రంప్ ప్రభుత్వం నిషేధం విధించడాన్ని అక్కడి కోర్టు నిలుపుదల చేశాయి.


By April 20, 2021 at 11:23AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/former-us-president-trump-urged-to-joe-biden-for-travel-ban-on-certain-muslim-countries/articleshow/82157497.cms

No comments