Breaking News

కరోనా: ఒక్కో రాష్ట్రంలో మునుపటి పరిస్థితులు.. పంజాబ్‌లో కర్ఫ్యూ


దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి కిందటేడాది కంటే అధ్వాన్నంగా మారింది. దీంతో వైరస్ కట్టడి కోసం మునుపటి మాదిరిగా కఠిన ఆంక్షలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో మినీ లాక్‌డౌన్ తరహా ఆంక్షలను విధించగా.. తాజాగా ఈ జాబితాలో రాష్ట్రం చేరింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో పంజాబ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్‌లో రాత్రిపూట కర్ఫ్యూ ()ను విధిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ బుధవారం (ఏప్రిల్ 7) ఉత్తర్వులు జారీ చేశారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని పంజాబ్ ప్రభుత్వం పేర్కొంది. ఈ సమయాల్లో అత్యవసర సేవల కోసం మాత్రమే అనుమతి ఇస్తామని తెలిపారు. నైట్ కర్ఫ్యూతో పాటు విద్యాసంస్థలు కూడా మూసివేసే ఉంటాయని వెల్లడించారు. ఏప్రిల్ 30 వరకు నిబంధనలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. రాజకీయ, ఇతర ఎలాంటి సమావేశాలు నిర్వహించరాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులందరూ విధిగా మాస్క్ ధరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. పంజాబ్‌లో కరోనా పరిస్థితిపై ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ బుధవారం అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా పంజాబ్‌లో రోజూవారి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఇక్కడ వైరస్ వ్యాప్తికి 80 శాతం యూకే వేరియంట్ కారణం అవుతోంది. మరణాల సంఖ్య పెరిగింది. మంగళవారం ఒక్క రోజే పంజాబ్‌లో 2924 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ బారినపడి గడిచిన 24 గంటల్లో పంజాబ్‌లో 62 మంది మరణించారు. దీంతో పంజాబ్‌లో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 7,216కు చేరుకుంది. మొత్తం కేసుల సంఖ్య 2,57,057కు ఎగబాకింది. ప్రస్తుతం రాష్ట్రంలో 25,913 యాక్టివ్ కేసులు ఉన్నాయి.


By April 07, 2021 at 05:00PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/covid-19-surge-night-curfew-in-punjab-till-april-30-political-gatherings-banned/articleshow/81951061.cms

No comments