బ్రేకింగ్ న్యూస్: శరత్ కుమార్, రాధికలకు ఏడాది జైలు శిక్ష విధించిన ప్రత్యేక కోర్టు
సీనియర్ నటుడు శరత్ కుమార్, ఆయన భార్య రాధికలకు ఏడాది జైలు శిక్ష విధిస్తున్నట్లు చెన్నై ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరిచింది. రేడియన్స్ అనే సంస్థ నుంచి అప్పుగా రెండు కోట్లు తీసుకుని ఆ మొత్తాన్ని చెల్లించే ప్రాసెస్లో చెక్ బౌన్స్ అయింది. దీంతో రేడియన్స్ సంస్థ వీరిపై చెన్నైలోని సైదాపేట కోర్టులో దాఖలు చేసింది. 2019 జూన్లో దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం వీరిద్దరితో పాటు లిస్టిన్ స్టీఫెన్ అనే మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేయాలని తీర్పు వెలువరించింది. అయితే ఈ కోర్టు తీర్పును సవాలు చేసు ఈ దంపతులు మద్రాస్ హై కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసు విచారణని హై కోర్టు ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ చేసింది. కాగా, బుధవారం(ఏప్రిల్ 7న) దీనిపై మరో మారు విచారణ చేపట్టిన ప్రత్యేక న్యాయస్థానం సాక్ష్యాధారాలను పరిశీలించి.. ఈ దంపతులకు ఏడాది జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పునిచ్చింది. దీంతో మరో మారు ఈ తీర్పును సవాలు చేసూ ఈ సెలబ్రిటీ దంపతలు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
By April 07, 2021 at 02:06PM
No comments