Breaking News

ఢిల్లీలో కరోనా ఉద్ధృతం.. వారాంతపు కర్ఫ్యూ.. కేజ్రీ సంచలన నిర్ణయం


కరోనా కట్టడికి దేశ దేశ రాజధాని ఢిల్లీలో రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, మహమ్మారి ఉగ్రరూపం దాల్చడంతో కేజ్రీవాల్ ప్రభుత్వం గురువారంం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ కట్టడి చర్యల్లో భాగంగా వారాంతపు లాక్‌డౌన్ (కర్ఫ్యూ) విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపారు. ఈ సమయంలో మాల్స్‌, జిమ్‌లు, ఆడిటోరియంలు, స్పా సెంటర్లను పూర్తిగా మూసివేస్తున్నట్లు వెల్లడించారు. రెస్టారంట్లలో కేవలం హోండెలివరీకి మాత్రమే అనుమతి ఉంటుందని, 30శాతం సామర్థ్యంతో మాత్రమే సినిమా థియేటర్లను నడపాలని స్పష్టం చేశారు. అత్యవసర సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ముందుగానే నిర్ణయించుకున్న వివాహ వేడుకులను మాత్రం అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, అతిథుల సంఖ్యపై మాత్రం పరిమితులు విధించారు. వేడుకల్లో 50 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. అలాగే, అంత్యక్రియల్లోనూ 20 మందికి మించరాదని స్పష్టం చేశారు. ఇక ఆసుపత్రుల్లో పడకల కొరత లేదని, తాజా గణాంకాల ప్రకారం.. 5,000పైగా పడకలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రజలంతా కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు లేకుండా తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ‘‘ప్రజల ఆరోగ్యం దృష్ట్యానే ఈ ఆంక్షలు విధించాల్సి వస్తోంది. మీ కోసం, కుటుంబాల క్షేమం కోసమే.. వీటి వల్ల మీరు ఇబ్బంది పడతారని తెలుసు.. కానీ, వైరస్‌ వ్యాప్తిని అడ్డుకుని ఛైన్‌ను తుంఛాలంటే ఆంక్షలు అత్యవసరం.. ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేడు.. వారం మొత్తం అత్యవసర సర్వీసులు అందుబాటులో ఉంటాయి’’ అని సీఎం కేజ్రీవాల్ వీడియో ప్రసంగంలో తెలిపారు. ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌, ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయిన అనంతరం కేజ్రీవాల్‌ ఈ ప్రకటన చేశారు. గత కొద్ది రోజులుగా ఢిల్లీలో కరోనా విజృంభణ తీవ్రంగా ఉంది. బుధవారం అక్కడ రికార్డు స్థాయిలో 17,282 కేసులు నమోదుకాగా... ఢిల్లీలో ఇంత భారీస్థాయిలో రోజువారీ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. అలాగే, బుధవారం ఒక్క రోజే 100 మంది కోవిడ్-19కు బలయ్యారు. ప్రస్తుతం అక్కడ 50,736 యాక్టివ్ కేసులున్నాయి. ఢిల్లీలో పాజిటివ్ రేటు 16 శాతానికి చేరింది. సోమవారానికి ఇది 12.4 శాతంగా ఉండటం గమనార్హం. తాను లాక్‌డౌన్‌కు వ్యతిరేకమని, ఒకవేళ ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోతే చివరి అస్త్రంగా మాత్రమే పరిగణించాలని ఇటీవల కేజ్రీవాల్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఢిల్లీలో యూకే రకం కోవిడ్ స్ట్రెయిన్ విజృంభిస్తోన్నట్టు జన్యు విశ్లేషణలో వెల్లడయ్యింది.


By April 15, 2021 at 03:29PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/amid-covid-cases-surge-weekend-curfew-in-delhi-malls-gyms-shut-says-arivind-kejriwal/articleshow/82083047.cms

No comments