Breaking News

మార్కెట్‌లోకి వెళ్తే గంటకు రూ.5.. కరోనా కట్టడికి వినూత్న ప్రయోగం


మహారాష్ట్రలో తీవ్రరూపం దాల్చడంతో మహమ్మారి నియంత్రణకు అధికార యంత్రంగా తీవ్రంగా శ్రమిస్తోంది. రికార్డుస్థాయిలో కొత్త కేసుల నమోదు ఆందోళనకు గురిచేస్తోంది. గడచిన 24 గంటల్లో అక్కడ 39వేల మందికిపైగా వైరస్ బారినపడ్డారు. నాసిక్ ప్రాంతంలోనూ వైరస్ తీవ్రత అధికంగా ఉంది. కరోనా కేసుల భారీగా నమోదుకావడంతో నాసిక్ మున్సిపల్ అధికారులు వినూత్న విధానం అవలంభిస్తున్నారు. సామాన్యలు, నిత్యావసరాల కొనుగోలు కోసం మార్కెట్‌కు వచ్చేవారి నుంచి గంటకు కొంత మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. ‘నాసిక్‌లో కోవిడ్-19 నియంత్రణఖు వివిధ మార్గాలను అనుసరిస్తున్నాం.. మార్కెట్ ఏరియాలోకి వచ్చే ప్రతి ఒక్కరికీ గంటకు రూ.5 వసూలు చేస్తున్నారు.. దీని వల్ల లాక్‌డౌన్‌కు వెళ్లకుండా నిలువరించే ప్రయత్నం చేస్తున్నాం’ అని నాసిక్ పొలీస్ కమిషనర్ దీపక్ పాండే తెలిపారు. మరోవైపు, మహారాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఆ రాష్ట్ర మంత్రి రాజేశ్ తోపే విజ్ఞ‌ప్తి చేశారు. ‘కోవిడ్ రోగుల రాకతో ఐసీయూ, ఆక్సిజన్ బెడ్‌లు వేగంగా నిండిపోయి రాష్ట్రంలోని హాస్పిటల్స్ పరిస్థితి దారుణంగా మారింది.. ఎందుకంటే ప్రజలు చాలా ఆలస్యంగా పరీక్షలు చేయించుకుంటున్నారు.. కాబట్టి ప్రతి ఒక్కళ్లూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞ‌ప్తి చేస్తున్నాను’ అని కోరారు. ఇదిలా ఉండగా, మహారాష్ట్రలో లాక్‌డౌన్‌కు ప్రణాళిక రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, దీనిని సంకీర్ణ ప్రభుత్వంలోని ఎన్‌సీపీ, ప్రతిపక్ష బీజేపీ వ్యతిరేకిస్తున్నాయి. లాక్‌డౌన్‌కు బదులు ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని సీఎం ఉద్ధవ్‌కు ఎన్‌సీపీ నేత, మంత్రి నవాబ్ మాలిక్ సూచించారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు విధిగా అనుసరించకపోవడం వల్లే పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని, లాక్‌డౌన్ ఒక్కటే చివరి అస్త్రమని సీఎం పదే పదే హెచ్చరిస్తున్నారు.


By April 01, 2021 at 09:54AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/rs-5-to-enter-market-for-an-hour-nashik-city-plan-to-avoid-lockdown/articleshow/81815377.cms

No comments