Breaking News

రూ.1,001 కోట్లతో ఇల్లు కొనుగోలు.. మరోసారి వార్తల్లో డీమార్ట్ అధినేత!


డీమార్ట్‌ వ్యవస్థాపకుడు అత్యంత ఖరీదైన నివాసాన్ని కొనుగోలు చేసి మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. కొద్ది నెలల కిందట ఇండియా సిమెంట్స్‌లో 10 శాతానికి పైగా వాటా కొనుగోలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు దమానీ. తాజాగా, ముంబయిలోని అత్యంత ఖరీదైన మలబార్‌ హిల్‌ ప్రాంతంలో రూ.1,000 కోట్లతో విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశారు. మొత్తం ఒకటిన్నర ఎకరాల స్థలంలో 60వేల చదరుపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన మధు కుంజ్ బంగ్లాను దమానీ సొంతం చేసుకున్నారు. 90 ఏళ్ల కిందట జీ ప్లస్ భవంతిని ప్రేమ్‌చంద్‌ రాయ్‌చంద్‌ అండ్‌ సన్స్‌ నుంచి తన సోదరుడితో కలిసి రాధాకిషన్‌ దమానీ కొనుగోలు చేశారు. ‘ముంబయిలోని అత్యంత పురాతన వ్యాపారుల కుటుంబాల్లో ఇది కూడా ఒకటి. వీరి పూర్వీకులు ముంబయి ఫోర్ట్ సమీపంలో 19వ శతాబ్దంలో వెనిటియన్ గోథిక్ రాజాబాయ్ క్లాక్ టవర్‌ను నిర్మించారు’ అని ఆ కుటుంబం గురించి తెలిసిన ఓ వ్యక్తి తెలిపారు. ఈ బంగ్లా రిజిస్ట్రేషన్ కోసం స్టాంపు డ్యూటీ కింద రూ.30 కోట్లు చెల్లించారు. ఇవి ముంబయి రియల్‌ఎస్టేట్‌ మార్కెట్లో ఇటీవల కాలంలో నమోదైన అతిపెద్ద లావాదేవీలుగా సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. కొవిడ్‌-19 కారణంగా గతేడాది ముంబయిలో రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ పడిపోయినప్పటికీ తిరిగి పుంజుకుందని, తాజా ఉదంతమే అందుకు ఉదాహరణ అని ఆ వర్గాలు వివరిస్తున్నాయి. దమానీ ఇటీవల థానేలో 8 ఎకరాల స్థలాన్ని మాండెలెజ్‌ ఇండియా (గతంలో క్యాడ్బరీ ఇండియా) నుంచి రూ.250 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కొనుగోలు చేసిన బంగ్లా నారాయణ్ దభోల్కర్ రోడ్డుల ఉంది. దక్షిణ ముంబయిలోని అత్యంత ప్రత్యేకమైన, ఖరీదైన నివాస సముదాయాల్లో ఇదీ ఒకటి. ఇక్క అపార్లమెంట్‌ కనీస ధర చదరపు అడుగు రూ.80వేలకుపై మాటే ఉంటుంది. మలబార్ హిల్ ప్రాంతంలో ఎకరం భూమి రూ.400 కోట్లు పలుకుతుంటే దమాని ఎందుకు ఇంత ధర చెల్లించడానికి కారణం ఉందని విశ్లేషకులు అంటున్నారు. “ఈక్విటీలో చాలా లాభాలు రావడంతో మూలధన ప్రణాళికలో కొన్ని అంశాలు ఉన్నాయి.. నివాస గృహం కావడంతో పన్ను రహితంగా తిరిగి పెట్టుబడి పెట్టవచ్చు. భవిష్యత్తులో భూమిను పొందవచ్చు’ అని అన్నారు. గతంలో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ అధినేత అధర్ పూనావాలా, ఆయన తండ్రి 2015లో దక్షిణ ముంబయిలోని అమెరికా కాన్సులేట్‌కు చెందిన ఆస్తి లింకన్ హౌస్‌ను రూ.750 కోట్లు కొనుగోలు చేశారు. గోద్రోజే కుటుంబం కూడా 2014లో హోమీ బాబా స్మారక భవనం కోసం రూ.372 కోట్లు వెచ్చించింది.


By April 04, 2021 at 12:41PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/dmart-founder-radhakishan-damani-snap-up-mumbai-bungalow-for-record-rs-1001-crore/articleshow/81895838.cms

No comments