Breaking News

స్వామి నా మెడలో గొలుసు వేశారు.. ఒక్కసారి టచ్ చేయొచ్చా అని భక్తులు నా కాళ్లపై పడ్డారు: సింగర్ సునీత


పెళ్లి తరువాత సింగర్ వరుస ఇంటర్వ్యూలతో బిజీ అవుతున్నారు తాజాగా ఓ ప్రముఖ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక చింతనను తన జీవితంలో భాగంగా భావించే సునీత.. అప్పట్లో పుట్టపర్తి సాయిబాబాని దర్శించుకున్నప్పుడు ఓ అద్భుతాన్ని చూడగలిగానని ఆ విషయాన్ని షేర్ చేసుకున్నారు. ఇండస్ట్రీకి సంబంధించిన మధుకర్ గారు.. స్వామి (పుట్టపర్తి సాయిబాబా) చాలా దగ్గర. వారి కుటుంబం స్వామి భక్తులు. ఆయన ద్వారా స్వామి వారి ఆశ్రమానికి వెళ్లాను. నా దృష్టిలో దేవుడు అంటే ఒక పవర్ అని అర్థం. ఒక మనిషిని దేవుడిగా చిత్రీకరించుకోవడం ఎప్పుడూ నాకు లేదు. నేను డైరెక్ట్ నమ్మకపోవచ్చు కానీ.. బోలెడంత మంది నమ్మకాన్ని నేను నమ్ముతాను. స్వామి వారి ఆశ్రమంలో ఆరోజు చాలారోజు పాడాను. స్వామి వారు నన్ను మెచ్చుకుని నన్ను దగ్గరకు పిలిచి చాలా సేపు మాట్లాడి.. ప్రత్యేకంగా ఆశీర్వదించారు. ఇది నాకు చాలా ప్రత్యేకమైనది అని ఎప్పుడు తెలిసింది అంటే.. ఆ కార్యక్రమం అయిపోయిన తరువాత బయటకు వచ్చిన తరువాత.. చుట్టుపక్కల ఉన్న ఆయన భక్తులు నా దగ్గరకు వచ్చి ఏడ్వడం.. మీరు ఎంత అదృష్టవంతులో తెలుసా? అని మాట్లాడటం.. స్వామి వారు నా మెడలో గొలుసు వేశారు. చాలామంది విదేశీ భక్తులు కూడా నా దగ్గరకు వచ్చి.. ఒక్కసారి ముట్టుకోవచ్చా మిమ్మల్ని.. కెన్ ఐ టచ్ యు వన్స్ ప్లీజ్ అని అడిగేవారు. వాళ్లంతా వచ్చి నా కాళ్లకి దండం పెట్టేవారు. ఇదేదో నా గొప్పతనం అని కాదు.. స్వామి వారు నన్ను అంత ప్రత్యేకంగా ట్రీట్ చేశారంటే నాలో ఏదో ఉన్నదని.. నా ఫెలో హ్యామన్ బీయింగ్స్ నమ్మారు. మిరాకిల్ ఏంటి అంటే.. స్వామితో మాట్లాడింది అంతా నా పర్సనల్ లైఫ్ గురించే ఇది కెమెరా ముందు ఎందుకు చెప్తున్నా అంటే సాక్ష్యం ఉంది కనుకు. ఆరోజు స్వామి నాతో మాట్లాడటం.. నాతో పాటు వచ్చిన మ్యుజీషియన్స్ లీలగా విన్నారు. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. వాటిని అనుభవించాలి అంతే. ఇలాంటి అద్భుతాలు ఆ దేవుడు నా జీవితంలో చాలా చేశాడు’ అంటూ చెప్పుకొచ్చారు సింగర్ సునీత.


By March 10, 2021 at 01:32PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/singer-sunitha-about-puttaparthi-sathya-sai-baba/articleshow/81426914.cms

No comments