Breaking News

బ్రెయిన్ స్విచ్చాఫ్ చేసి ఎంజాయ్ చేసేయండి.. జాతిరత్నాలు మూవీపై అల్లు అర్జున్ క్రేజీ ఫీలింగ్స్


యంగ్ కుర్రోళ్లు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి నిన్న (గురువారం) మహా శివరాత్రి రోజున జాతిరత్నాలుగా కడుపుబ్బా నవ్వించారు. పొట్టచెక్కలయ్యే వినోదంతో '' సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీగా థియేటర్స్‌లో గోల పెట్టించింది ఈ సినిమా. సినిమా మొదలైన క్షణం నుంచి శుభం కార్డు పడే క్షణం వరకూ ఎక్కడా వినోదానికి ఫుల్‌స్టాప్ పడలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ చూసిన స్టైలిష్ స్టార్ తన ఫీలింగ్స్ తెలుపుతూ ట్వీట్స్ చేశారు. ''నిన్న రాత్రి 'జాతిరత్నాలు' సినిమా చూశా. ఇది హిలేరియస్‌ కామెడీ ఎంటర్‌టైనర్. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లోకెల్లా కడుపుబ్బా నవ్వించిన సినిమా ఇదే. చిత్ర యూనిట్‌ మొత్తానికి కంగ్రాట్స్. నవీన్ పొలిశెట్టి తన పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు. రాహుల్ రామకృష్ణ బ్రిల్లియెంట్‌గా నటించాడు. సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు'' అని పేర్కొంటూ మొదటి ట్వీట్ చేసిన అల్లు అర్జున్.. ఆ వెంటనే మరో రెండు ట్వీట్స్ పెడుతూ 'జాతిరత్నాలు' సినిమాను ప్రశంసించారు. ప్రియదర్శి, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా సహా మిగితా ఆర్టిస్టులంతా అద్భుతమైన నటన కనబర్చారని, రాధన్ సమకూర్చిన బాణీలు చాలా బాగున్నాయని అల్లు అర్జున్ పేర్కొన్నారు. అలాగే టెక్నీషియన్ల పనితీరు భేష్ అంటూ పొడిగారు. ఇక చిత్ర నిర్మాతలు నాగ్ అశ్విన్, స్వప్న దత్, అశ్వినీ దత్ లకు ప్రత్యేక అభినందనలు తెలిపిన బన్నీ.. దర్శకుడు అనుదీప్ గురించి ప్రత్యేకంగా తన మనసులోని మాట చెప్పారు. ఈ సినిమాలో అనుదీప్ దర్శకత్వ ప్రతిభ చూశాక ఆయనపై గౌరవం మరింత పెరిగిందని, బ్రెయిన్ స్విచ్చాఫ్ చేసి ఈ ఫన్ రైడ్ ఎంజాయ్ చేసేయండి అంటూ అల్లు అర్జున్ సందేశమిచ్చారు. బన్నీ చేసిన ఈ ట్వీట్స్ సినిమాకు మంచి బూస్టింగ్ అని చెప్పుకోవచ్చు.


By March 12, 2021 at 01:03PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/allu-arjun-comments-on-naveen-polishettys-jathi-ratnalu-movie/articleshow/81463522.cms

No comments