Breaking News

కోవిడ్ ముగింపునకు చేరుకుందని మంత్రుల ప్రకటన.. తీవ్రంగా హెచ్చరించిన ఐఎంఏ


దేశంలో కరోనా వైరస్ మహమ్మారి ముగింపు దశకు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రి , ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌లు చేసిన ప్రకటనలపై అఖిల భారత వైద్యుల సంఘం తీవ్రంగా మండిపడింది. రాజకీయ నాయకులు, ప్రభుత్వం ‘ప్రజా భద్రతపై తప్పుడు’ ప్రచారం ప్రారంభించారని హెచ్చరించింది. ‘అంటువ్యాధి, మహమ్మారి వ్యాప్తి స్థితిపై రాజకీయ వర్గాలు చర్చించడం, ప్రకటనలు చేయడం బాధాకరం.. దీనిని ప్రపంచ ఆరోగ్య సంస్థ లేదా ఐసీఎంఆర్ మాత్రమే శాస్త్రీయ ఆధారాల ద్వారా నిరూపించాలి’ అని ఐఎంఏ ఓ ప్రకటనలో తెలిపింది. కోవిడ్ కారణంగా ఢిల్లీలో 740 మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు ప్రాణాలు కోల్పోయారని, తోటి పౌరులు అప్రమత్తంగా ఉండి విధిగా మాస్క్‌లు ధరించి, భౌతికదూరం పాటించాలని సూచించారు. ‘గత వారం రోజుల్లోనే ఢిల్లీ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 35 నుంచి 40 శాతం మేర పాజిటివ్ కేసులు పెరిగాయి.. రోజువారీ కేసులు 100 నుంచి 140 మేర పెరుగుతున్నాయి’ అని పేర్కొంది. మనకు మనం ప్రగల్భాలు పలికి, గొప్పలు చెప్పుకోవదని అనకాధికర రాజకీయ నేతల ప్రకటనలపై ఐఎంఏ హెచ్చరించింది. కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్‌వర్దన్ ఆదివారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేశంలో కరోనా వైరస్ మహమ్మారి ఆట ముగింపునకు చేరిందని వ్యాఖ్యానించారు. ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ సైతం.. దేశ రాజధానిలో కోవిడ్ దాదాపు ముగింపు దశకు చేరిందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ఐఎంఏ.. హెచ్చరించింది. మహమ్మారి అంటే జాతీయ సరిహద్దులకు మించి, ఒక ఖండం అంతటా లేదా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతుంది.. అయితే ఒక స్థానిక ప్రాంతంలో ఒక అంటు వ్యాధి సాధారణ నిలకడ, జనాభాలో ఎక్కువ భాగాన్ని ప్రభావితం చేస్తుంది. దేశంలోని ఢిల్లీ, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో గత కొద్ది వారాల నుంచి కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వరుసగా నాలుగో రోజు 18వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి.


By March 09, 2021 at 08:15AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/as-ministers-talk-end-of-pandemic-a-strong-warning-from-indian-medical-association/articleshow/81403786.cms

No comments