శతాబ్ది ఎక్స్ప్రెస్లో మంటలు
శతాబ్ది ఎక్స్ప్రెస్లో చోటు చేసుకుంది. C4 బోగీ మంటల్లో కాలిపోయింది. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళ్తున్న రైలు శనివారం (మార్చి 13) మధ్యాహ్నం ఉత్తరాఖండ్లోని కాన్స్రో సమీపంలో రాజాజీ టైగర్ రిజర్వ చేరుకోగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం సంభవించినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం అందిన వెంటనే అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ప్రమాదం సంభవించిన సీ4 బోగీని రైలు నుంచి వేరు చేసి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. Must Read: ✧ ✧ ✧
By March 13, 2021 at 02:56PM
No comments