Breaking News

అసలు నిజం దాచిపెట్టి పెళ్లి.. విషయం తెలిసి విస్తుపోయిన యువతి


తాను ముస్లిం అనే విషయాన్ని దాచిపెట్టి హిందూ మహిళను ట్రాప్ చేసి వివాహం చేసుకున్న ముస్లిం.. తర్వాత ఆమెను మతం మారాలని బలవంతం చేశాడు. దీనికి ఆమె ఒప్పుకోకపోవడంతో వేధింపులకు పాల్పడిన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో వెలుగుచూసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదుచేసిన పోలీసులు.. అతడితో పాటు బంధువును అరెస్ట్ చేశారు. గోరఖ్‌పూర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది బాధితురాలిని కలిసిన నిందితుడు మొయినుద్దీన్ తనను మున్నా యాదవ్‌గా పరిచయం చేసుకున్నాడు. ఇద్దరి మధ్యా పరిచయం పెరగడంతో పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో సంత్ కబీర్ నగర్ జిల్లాలోని ఓ ఆలయంలో పెళ్లిచేసుకుని కాపురం పెట్టారు. కొద్ది రోజుల తర్వాత మున్నా యాదవ్ అలియాస్ మొయినుద్దీన్ తన నిజస్వరూపం బయటపెట్టాడు. తాను ముస్లిం అని, తన పేరు మొయినుద్దీన్ అని చెప్పాడు. అప్పటి నుంచి బాధిత మహిళను వేధింపులకు గురిచేశాడు. ఆమెను ఇస్లాంలోకి మారాలని బలవంతపెట్టాడు. దీనికి ఆ మహిళ అంగీకరించకపోవడంతో హింసించాడు. అతడి వేధింపులు కొనసాగుతుండగానే మరో పెళ్లికి సిద్ధమైనట్టు తెలుసుకున్న బాధితురాలు పోలీస్ హెల్ప్‌లైన్ 112కి శనివారం ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. దీంతో అతడిపై కేసు నమోదుచేసిన పోలీసులు.. మొయినుద్దీన్, అతడి బంధువు రెహ్మాన్ అలీని అరెస్ట్ చేశారు. ‘మొయినుద్దీన్ అలియాస్ మున్నా యాదవ్‌పై యూపీ మతమార్పిడి వ్యతిరేక ఆర్డినెన్స్ 2020లోని సెక్షన్ 323,504, 506, 419, 120బీ కింద కేసు నమోదుచేసి ఆదివారం అదుపులోకి తీసుకున్నాం’ అని గోరఖ్‌పూర్ పోలీస్ అధికారి దేవేంద్ర కుమార్ సింగ్ అన్నారు.


By March 09, 2021 at 02:02PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-faked-identity-to-marry-woman-forced-her-to-convert-in-uttar-pradesh/articleshow/81408744.cms

No comments