Breaking News

ఆటోను ఢీకొట్టిన బస్సు.. 10 మంది మహిళలు సహా 13 మంది మృతి


మధ్యప్రదేశ్‌లో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆటోను బస్సు ఢీకొట్టిన ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. గ్వాలియర్‌లోని పురానీ ఛవానీ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పురానీ ఛవానీ వద్ద ఎదురుగా వస్తున్న ఆటోను బస్సు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆటోలోని ప్రయాణిస్తున్న 10 మంది అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడినవారిలో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. వేగంగా వస్తున్న బస్సు ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రతకు ఆటో నుజ్జునుజ్జయ్యింది. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. బస్సులోని ప్రయాణికులకు గాయలైనట్టు తెలిపారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. మృతుల్లో 10 మంది మహిళలు ఉన్నారు. ఆటో డ్రైవర్ సహా మొత్తం 13 మంది చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో మహిళలు అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్నవారిగా గుర్తించారు. అంగన్వాడీ కేంద్రంలో పనిపూర్తిచేసుకుని ఇంటికి తిరిగొస్తుండగా ప్రమాదం చోటుచేసుకుందని గ్వాలియర్ ఎస్పీ తెలిపారు. ఘటనా స్థలిలోనే 8 మంది మహిళలు చనిపోయారని, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారన్నారు. ప్రమాదంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆర్ధిక సాయం ప్రకటించారు. ఒక్కొక్కరికి రూ.4 లక్షలు చొప్పున ప్రకటించిన సీఎం.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందజేయాలని అధికారులను ఆదేశించారు.


By March 23, 2021 at 09:27AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/13-killed-after-bus-collided-with-auto-in-gwalior-in-madhya-pradesh/articleshow/81643842.cms

No comments