Breaking News

ఏం జరిగిందో మాకు తెలుసు.. ఇప్పుడేం మాట్లాడను: దిశ తల్లి ఆసక్తికర వ్యాఖ్యలు


సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమానికి మద్దతు తెలియజేయడానికి స్వీడన్ బాలిక గ్రెటా థన్‌బర్గ్ షేర్ చేసిన టూల్‌కిట్‌కు ఖలిస్థాన్ వేర్పాటువాదులతో సంబంధం ఉన్నట్టు పోలీసులు ఆరోపిస్తున్నారు. థన్‌బర్గ్ షేర్ చేసిన టూల్‌కిట్‌ను బెంగళూరుకు చెందిన పర్యావరణ కార్యకర్త ఎడిట్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమెను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే, తన కుమార్తె అరెస్ట్ అంశంపై మీడియాతో మాట్లాడటానికి దిశ రవి తల్లి నిరాకరించారు. ‘ఏం జరిగిందో మాకు తెలుసు.. ఈ సమయంలో మీడియాతో మాట్లాడటానికి మేము ఇష్టపడటం లేదు’ అని దిశ తల్లి మంజుల రవి అన్నారు. మీడియా ప్రతినిధులను లోపలికి రాకుండా వారి పెంపుడు కుక్క జర్మన్ షెపర్డ్ అడ్డుకోవడం కొసమెరుపు. బెంగళూరు సబర్బన్‌ చిక్కబనవారాలో ఐదేళ్ల కిందట దిశ రవి తల్లిదండ్రులు ఇల్లు నిర్మించినట్టు స్థానికులు చెప్పారు. ఆ ప్రాంతంలో చాలా మంది కొత్తగా వచ్చిన వ్యక్తులే ఉన్నారని దిశ ఇంటి పక్కనే ఉండే ఓ దుకాణం యజమాని తెలిపాడు. ‘దిశ తన పెంపుడు కుక్కను ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం బయటకు తీసుకొస్తుంది.. వారి ఇంటి ఆవరణలో ఉండే చిన్న గార్డెన్‌‌లో దిశ, మంజుల రోజూ కూర్చుంటారు’ అని ఓ మహిళ చెప్పింది. ‘శనివారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో రెండు కార్లు వచ్చి దిశ ఇంటి ముందు ఆగాయి.. గేటు వద్ద ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉండటం కనిపించింది.. ఏం జరుగుతుందో తమకు తెలియకపోవడంతో దూరంగా ఉన్నాం... మా పక్కింటిలో ఉండే వ్యక్తి ఫోన్ చేసిన దిశను సాయంత్రం 6 గంటలప్పుడు తీసుకెళ్లారని చెప్పాడు.. కానీ, ఆమెను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారని గ్రహించలేదు’ అని మరో వ్యక్తి తెలిపాడు. దిశ తరుచూ తమ వద్ద బ్రెడ్, స్నాక్స్, చాక్‌లెట్స్ కొంటుందని అక్కడ షాప్ యజమాని చెప్పాడు. అంతేకాదు, తన వెంట ఎప్పుడూ కుక్క ఉంటుంది, ఆమెను అరెస్ట్ చేసిన విషయం, కేసు గురించి తమకేమీ తెలియదని అన్నాడు.


By February 15, 2021 at 01:56PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/we-know-whats-happening-dont-want-to-talk-now-disha-ravis-mother/articleshow/80921933.cms

No comments