Breaking News

దేవభూమిలో కన్నెర్రజేసిన ప్రకృతి.. 8 మంది మృతి, మరో 170 మంది మిస్సింగ్


దేవభూమిలో మరోసారి ప్రకృతి కన్నెర జేసింది. విరిగిపడి ఆదివారం జలవిలయం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 14 మంది మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 170 మంది గల్లంతయ్యారు. మరో 16 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. చమోలీ జిల్లా జోషిమఠ్‌ సమీపంలో హిమశిఖరం నందాదేవి మంచు చరియలు విరిగిపడి ధౌలీగంగ నదిలో పడడంతో హఠాత్తుగా భారీ వరదలు సంభవించాయి. వరద ఉద్ధృతికి ఏకంగా ఓ జలవిద్యుత్కేంద్రం కొట్టుకుపోగా.. మరొకటి పాక్షికంగా ధ్వంసమయ్యింది. 13.2 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ కేంద్రం ప్రవాహం ధాటికి కొట్టుకుపోయింది. ఆదివారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకోగా.. రాత్రి 8.00 గంటల సమయానికి అలక నందలో ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. దీంతో సహాయక చర్యలు తీవ్ర ఆటంకం ఏర్పడింది. అలకనంద, ధౌలీగంగ, రుషి గంగ నదుల మధ్య ప్రాంతంలో ఈ విపత్తు చోటు చేసుకుంది. గంగానదికి ఉపనదులైన రుషిగంగ ధౌలీగంగలో కలిసి అనంతరం ఈ రెండూ అలకనందలో మమేకమవుతాయి. ధౌలీగంగలో సాధారణ నీటి మట్టానికి మించి మూడు మీటర్ల ఎత్తున నీరు ప్రవహిస్తోంది. తపోవన్‌-రైనీ వద్ద ఎన్‌టీపీసీ ఏర్పాటుచేసిన తపోవన్‌-విష్ణుగద్‌ 480 మెగావాట్‌ల జలవిద్యుత్తు కేంద్రంలోకి నీరు చొచ్చుకెళ్లింది. ‘దీంతో అందులో పనిచేస్తున్న 170 మంది కార్మికులు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు’ అని ఉత్తరాఖండ్ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ తెలిపింది. వారంతా చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. పవర్ ప్లాంట్‌కు సంబంధించిన సొరంగం పనులు జరుగుతుండగా, అకస్మాత్తుగా వరద నీరు ప్రవేశించడంతో కార్మికులు నీటిలో చిక్కుకున్నారు. వీరిలో 16 మందిని ఐటీబీపీ, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ దళాలు రక్షించాయి. సొరంగాల్లో మట్టి పూడుకుపోవడం సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. అయితే, ఇక్కడ ఎంత మంది పనిచేస్తున్నారన్న దానిపై ఆ ప్రాజెక్టు అధికారులు స్పష్టమైన వివరాలు చెప్పకపోవడంతో గల్లంతయిన వారి సంఖ్య పెరిగే సూచనలు ఉన్నాయి. 250 మీటర్ల పొడవు ఉన్న ఆ సొరంగంలోకి జవాన్లు అతి కష్టం మీద 150 మీటర్ల వరకు వెళ్లగలిగారు. అయితే ఎవరి ఆచూకీ వారికి లభించలేదు. ప్రమాదం జరిగిన తర్వాత యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు అందించేందుకు వివిధ దళాలు రంగంలో దిగాయి. జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు అక్కడకు చేరుకుని, సహాయక చర్యలు చేపట్టాయి. సైన్యానికి చెందిన నాలుగు కాలమ్స్‌ జవాన్లు రంగంలోకి దిగారు. ఒక్కో కాలమ్‌లో వంద మంది సైనికులు ఉన్నారు. మొత్తంగా 600 మందికిపైగా సైనికులు సేవలు అందిస్తున్నారు.


By February 08, 2021 at 07:41AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/massive-damage-after-glacier-burst-triggers-flood-in-uttarakhand-14-dead-170-missing/articleshow/80741437.cms

No comments