Breaking News

పొగమంచు కారణంగా బస్సు బోల్తా.. 15 మంది దుర్మరణం


పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి, 15 మంది ప్రాణాలు కోల్పోయారు. బలూచిస్థాన్ రాష్ట్రంలో మంగళవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బలూచీస్థాన్‌లోని పాంజ్‌గురు నుంచి సింధ్ ప్రావిన్సుల్లోని కరాచీకి వెళ్తున్న బస్సు క్వెట్టా-కరాచీ జాతీయ రహదారిపై బోల్తాపడింది. ఉతల్ పట్టణం సమీపంలో అదుపుతప్పి బోల్తాపడటంతో బస్సులోని 15 మంది మృతి చెందగా... మరో 10మంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఐదుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఉతల్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. వేగంగా వస్తున్న బస్సును డ్రైవర్ నియంత్రించలేకపోవడంతోనే ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. అయితే, పొగ మంచ కారణంగా ప్రమాదం జరిగిందని స్థానిక పోలీస్ అధికారులు పేర్కొన్నారు. దట్టంగా మంచు కురవడం వల్ల రహదారి కనిపించక బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని అన్నారు.


By February 03, 2021 at 12:01PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/15-killed-in-bus-accident-due-to-overturned-in-balochistan-province-in-pakistan/articleshow/80664176.cms

No comments