Breaking News

స్టేజీపైనే కంటతడి పెట్టుకున్న యంగ్ హీరోయిన్.. దర్శకుడిని గుర్తు చేసుకుంటూ చాందినీ ఆవేదన


'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాతో కెమెరా ముందుకొచ్చి ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది నటి . గతేడాది 'కలర్ ఫొటో' సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకున్న చాందినీ ఇప్పుడు ఫుల్‌టైమ్ హీరోయిన్‌గా మారి వరుస అవకాశాలు పట్టేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె నటించిన లేటెస్ట్ మూవీ ''. ఈ సినిమా విడుదలకు సిద్దమైన సందర్భంగా ఓ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఇందులో స్టేజీపైనే హీరోయిన్ చాందినీ కంటతడి పెట్టుకుంటూ తీవ్ర ఆవేదన చెందింది. సూపర్ ఓవర్ మూవీ తెరకెక్కిస్తున్న సమయంలోనే ఈ మూవీ డైరెక్టర్ ప్రవీణ్ మృతిచెందాడు. ఈ మూవీ షూటింగ్ క్లైమాక్స్‌లో ఉండ‌గా ప్ర‌వీణ్ యాక్సిడెంట్‌కి గురికావడం, ఆ తర్వాత కొన్ని రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొంది మరణించడంతో యూనిట్ సభ్యులందరూ తీవ్ర ఆవేదన చెందారు. సినిమా షూటింగ్‌లో భాగంగా.. ఓ సీన్ వివరిస్తూ ఆయన యాక్సిడెంట్‌కి గురికావడం ప్రతి ఒక్కరినీ ఎంతో బాధపెట్టింది. దీంతో దర్శకుడు లేకపోయినా ఆయన కలను మాత్రం నిజం చేసేందుకు యూనిట్ మొత్తం కలిసి పనిచేసి ఈ మూవీ విడుదల చేస్తోంది. అయితే తాజా ఈవెంట్‌లో ఇదే విషయాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయింది హీరోయిన్ చాందినీ చౌదరీ. దర్శకుడు ప్రవీణ్ లేని లోటును తట్టుకోలేకపోయిన ఆమె స్టేజీపైనే కంటతడి పెట్టుకుంది. అలా చాందినీ చౌదరి కంటతడి పెట్టుకోవడం చూసి ఈ మూవీ హీరో నవీన్ చంద్ర ఆమెను ఓదార్చాడు. ఆ తర్వాత నవీన్ చంద్ర కూడా దర్శకుడితో ఉన్న అనుభవాలను తలచుకుంటూ తన బాధను వ్యక్తం చేశాడు. ప్ర‌వీణ్ చ‌నిపోయిన తర్వాత ఈ సినిమాను అంద‌రి ముందుకు తీసుకొచ్చేందుకు సుధీర్ చేసిన ప్ర‌య‌త్నానికి హ్యాట్సాఫ్ అని నవీన్ చంద్ర అన్నాడు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుధీర్ వ‌ర్మ దగ్గర అసిస్టెంట్‌గా ప‌నిచేసిన ప్ర‌వీణ్.. ఈ సూపర్ ఓవర్ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ చిత్రంలో నవీంచంద్ర, చాందినీ చౌదరీ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను ఓటీటీ వేదిక ఆహాలో రిలీజ్ చేస్తున్నారు.


By January 22, 2021 at 09:30AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/heroine-chandini-chowdary-emotional-at-super-over-event/articleshow/80398733.cms

No comments