మరో చిన్నారి ప్రాణం కాపాడిన మహేష్.. నమ్రత పోస్ట్తో సూపర్ స్టార్పై పొగడ్తల వర్షం
కేవలం తెర మీదే కాదు నిజ జీవితంలోనూ హీరో అనిపించుకుంటూ ఉదారత చాటుకుంటున్నారు నేటితరం హీరోలు. ఈ లిస్ట్లో ఉన్న హీరోల్లో టాలీవుడ్ సూపర్ స్టార్ ఒకరు. చిన్న పిల్లలు, వారి వారి తల్లిదండ్రుల పాలిట దేవుడిగా నిలుస్తూ ఆంధ్ర హాస్పిటల్స్తో కలిసి పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయిస్తున్నారు. ఇలా ఇప్పటికే ఎందరో చిన్నారులను కాపాడిన ఆయన తాజాగా మరో గుండెను బ్రతికించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆ చిన్నారి ఫోటోను పోస్ట్ చేశారు నమ్రత శిరోద్కర్. ''మరో చిన్నారి గుండె ఆపరేషన్ సక్సెస్ అయింది. టెట్రాలజీ ఆఫ్ ఫెలాట్ సర్జరీకి వెళ్లిన షేక్ రిహాన్ డిశ్చార్జ్ అయ్యాడని తెలిసి చాలా సంతోషిస్తున్నాం. ఆంధ్ర హాస్పిటల్స్ వైద్య బృందానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నా. ఆ చిన్నారి జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా. అతని కోసం మా ప్రార్థనలు కొనసాగుతూనే ఉంటాయి'' అని పేర్కొంటూ చిన్నారి షేక్ రిహాన్తో పాటు అతని తల్లిదండ్రుల ఫోటో పంచుకున్నారు నమ్రత. ఆమె చేసిన ఈ పోస్ట్ చూసి మేహేష్ బాబును, ఆయన మంచి హృదయాన్ని తెగ పొగిడేస్తూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇకపోతే ప్రస్తుతం 'సర్కారు వారి పాట' సినిమా పనులతో బిజీగా ఉన్నారు మహేష్ బాబు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, అవినీతికి సంబంధించిన స్ట్రాంగ్ కథాంశంతో ఈ మూవీ స్క్రిప్ట్ రెడీ చేశారని తెలుస్తుండటం మహేష్ అభిమానుల్లో ఆతృతను పెంచేసింది.
By January 17, 2021 at 02:34PM
No comments