Breaking News

ఏపీ నుంచి వచ్చి హైదరాబాద్‌లో పాడుపని, ఇద్దరు మహిళల అరెస్ట్


జనావాసాల మధ్య గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తున్న వ్యభిచార గృహంపై హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ పోలీసులు దాడి చేశారు. కడప జిల్లా పులివెందుల మండలానికి చెందిన ఓ మహిళ(50) కొంతకాలం క్రితం ఉపాధి కోసం వచ్చింది. సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో వ్యభిచారంలోకి దిగింది. ఎల్బీనగర్‌ సమీపంలోని రాక్‌టౌన్‌కాలనీలోని ఓ అపార్టుమెంటులో ఓ ప్లాట్ అద్దెకు తీసుకుంది. ఇతర ప్రాంతాల నుంచి ఇద్దరు యువతులను తీసుకొచ్చి వ్యభిచారం నడిపిస్తోంది. కర్నూలు జిల్లాకు చెందిన మరో మహిళ(38)తో కూడా ఆమెతో కలిసి విటులను ఆకర్షిస్తోంది. కొద్దిరోజులుగా గుట్టుగా కొనసాగుతున్న ఈ వ్యభిచార దందాపై సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం రాత్రి దాడి చేశారు. ఇద్దరు మహిళలతో పాటు, వీరికి సహాయం చేస్తున్న మన్సూరాబాద్‌కె చెందిన మరో వ్యక్తిని అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి నాలుగు సెల్‌ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు యువతులను రెస్క్యూ హోమ్‌కు తరలించారు.


By January 07, 2021 at 08:57AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/prostitution-racket-busted-in-hyderabad-two-women-arrested/articleshow/80145603.cms

No comments