Breaking News

యూకే ప్రధాని పర్యటన రద్దు మేం సాధించిన విజయం.. కేంద్రానికి ఓటమి: రైతు సంఘాలు


ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ హాజరుకావాల్సి ఉండగా.. అక్కడ కొత్తరకం కరోనా స్ట్రెయిన్ విజృంభించడంతో ఆయన భారత పర్యటనను రద్దుచేసుకున్న విషయం తెలిసిందే. అయితే, భారత్ పర్యటనను యూకే ప్రధాని రద్దుచేసుకోవడానికి కరోనా వైరస్ వ్యాప్తి కాదని వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతు సంఘాలు అంటున్నాయి. బ్రిటన్ ప్రధాని పర్యటన రద్దు వ్యవసాయ చట్టాలపై తమ పోరాట ఫలితమేనని పేర్కొన్నాయి. జాన్సన్ పర్యటన రద్దు తాము సాధించిన రాజకీయ విజయమని, ప్రభుత్వానికి దౌత్యపరంగా ఓటమిన అని వ్యాఖ్యానించాయి. అంతేకాదు, తమ పోరాటానికి ప్రపంచ మద్దతు లభించిందని ఉద్ఘాటించాయి. ‘బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దు రైతులు సాధించిన రాజకీయ విజయం.. మోదీ ప్రభుత్వానికి దౌత్యపరంగా ఓటమి.. తమ పోరాటానికి ప్రపంచవ్యాప్తంగా సామాజిక, రాజకీయ మద్దతు లభిస్తోంది’అని శన్యక్తు కిసాన్ మోర్చా ఓ ప్రకటనలో తెలిపింది. గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించనున్నామని, దీనికి గురువారం (జనవరి 7న) రిహార్సిల్‌ నిర్వహిస్తామని పేర్కొంది. బ్రిటన్ ప్రధాని భారత పర్యటన రద్దు ఎందుకంటే రైతుల ప్రయత్నానికి దక్కిన అతిపెద్ద విజయం అన్నారు. యూకే ప్రధాని పర్యటన రద్దుపై కేంద్ర ఓ ప్రకటన విడుదల చేసింది. ‘భారత గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి బోరిస్ జాన్సన్ మరోసారి ధన్యవాదాలు తెలిపారు.. కానీ, యూకేలో ప్రబలంగా ఉన్న కోవిడ్-19 వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని తన పర్యటన రద్దుకు చింతిస్తున్నాం.. సమీప భవిష్యత్తులో భారత్‌లో పర్యటించాలన్న తన ఉత్సాహాన్ని ఆయన పునరుద్ఘాటించారు’ అని పేర్కొంది. వ్యవసాయ చట్టాలపై ఆందోళనలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 80 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. వారిని అమరవీరులుగా రైతు సంఘాలు కీర్తిస్తున్నాయి. రైతుల ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారిందని రైతు సంఘాలు పేర్కొన్నాయి. ‘కేంద్ర ప్రభుత్వం చర్చలు రైతుల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించడం లేదు. చట్టాలను స్పష్టంగా రద్దు చేయాల్సి ఉందని ఏడో రౌండ్ చర్చల్లో స్పష్టం చేశారు.. దీనిని అర్థం చేసుకున్నామని, మరింత సంప్రదింపులు అవసరం ఉంటుందని స్పష్టంగా పేర్కొంది’ అఖిల భారత కిసాన్ సంఘర్షణ్ సహకార కమిటీ పేర్కొంది.


By January 07, 2021 at 08:28AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/cancellation-of-uk-pm-boris-jhonson-visit-our-victory-centres-defeat-farmer-unions/articleshow/80145307.cms

No comments