Breaking News

ప్రయాణాలపై నిషేధం కొనసాగుతుంది.. ట్రంప్ ప్రకటనపై స్పందించిన బైడైన్ టీమ్


కరోనా వైరస్ నేపథ్యంలో ఐరోపా, బ్రెజిల్ ప్రయాణికులపై విధించిన నిషేధం ఇక ముందు కూడా కొనసాగించనున్నట్టు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన యంత్రాంగం సోమవారం ప్రకటించింది. బైడెన్ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఐరోపా, బ్రెజిల్ ప్రయాణాలపై నిషేధం ఎత్తివేస్తున్నట్టు ప్రస్తుత అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు చేశారు. దీనిపై బైడెన్ ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకి స్పందిస్తూ.. ట్విట్టర్ ద్వారా ప్రకటన చేశారు. ‘మా వైద్యు నిపుణుల బృందం సూచనలు మేరకు జనవరి 26 వరకు ఐరోపా, బ్రెజిల్ ప్రయాణికులపై నిషేధం ఎత్తివేసే ఉద్దేశం తమ యంత్రాంగానికి లేదు’ అని పేర్కొన్నారు. ‘వాస్తవంగా కోవిడ్-19 వ్యాప్తిని మరింత నియంత్రించడానికి అంతర్జాతీయ ప్రయాణాల విషయమై ప్రజారోగ్య చర్యలను బలోపేతం చేయడానికి మేము ప్రణాళిక వేస్తున్నాం.. మహమ్మారితో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి.. ప్రపంచవ్యాప్తంగా కొత్తరకం స్ట్రెయిన్‌లు ఉద్భవిస్తున్నాయి.. ఇటువంటి సమయంలో అంతర్జాతీయ ప్రయాణాలపై ఉన్న నిషేధం ఎత్తివేయడం సరైంది కాదు’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఐరోపా, బ్రెజిల్ ప్రయాణికులపై నిషేధం ఎత్తివేశామని, చైనా, ఇరాన్‌లపై కొనసాగిస్తామని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాకు వచ్చేవారు ప్రయాణానికి మూడు రోజుల ముందు తప్పనిసరిగా కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత ట్రంప్, బైడెన్ యంత్రాంగాలు ఈ ప్రకటనలు విడుదల చేశాయి. ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్.. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి ఒక్క రోజు ముందే విరుద్ధ ప్రకటనలు వెలువడటం గమనార్హం. ఎన్నికల్లో బైడెన్ విజయాన్ని అంగీకరించని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రమాణస్వీకారానికి కూడా హాజరుకాబోవడం లేదని ప్రకటించారు. ఈ విషయంలో గత అధ్యక్షులు పాటించిన సంప్రదాయాన్ని ట్రంప్ పక్కనబెడుతున్నారు. 152 ఏళ్ల తర్వాత కొత్త అధ్యక్షుడి ప్రమాణస్వీకారానికి మాజీ అధ్యక్షుడు హాజరుకాకపోవడం ఇదే తొలిసారి.


By January 19, 2021 at 11:32AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-will-continue-travel-bans-says-joe-biden-team-despite-trumps-statement/articleshow/80341648.cms

No comments