Breaking News

ఛీఛీ.. అక్కడ దాచిన బంగారం.. అధికారులకు షాకిచ్చిన స్మగ్లర్లు


అధికారులు ఎంత కట్టుదిట్టంగా చర్యలు తీసుకున్నా... బంగారం మాత్రం సరిహద్దులు దాటి అక్రమంగా రవాణా చేస్తున్నారు. అధికారులకు కూడా ఏ మాత్రం అనుమానం రాని ప్రదేశాల్లో బంగారం దాచి అక్రమంగా తరలిస్తున్నారు. తాజాగా తమిళనాడు రాజధాని చెన్నై ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు బుధవారం తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా దుబాయి నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద 1.42 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే పట్టుబడిన వీరిద్దరూ బంగారాన్ని పురీష నాళంలో దాచి ఉంచగా, తనిఖీల్లో బయటపడింది. ఈ బంగారం విలువ రూ. 72.6 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. బంగారంతో పాటు రూ. 12.4 లక్షల విలువ చేసే సిగరెట్లు, స్మార్ట్ ఫోన్స్‌, ల్యాప్‌టాప్స్, లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రయాణికులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బంగారం ఎక్కడ నుంచి ఎక్కడకు తరలిస్తున్నారన్న అన్న విషయాలు ఆరా తీస్తున్నారు.


By January 14, 2021 at 11:58AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/1kg-of-gold-seized-at-chennai-airport/articleshow/80264021.cms

No comments