Breaking News

‘డిటెక్టివ్’ ద‌ర్శకుడు నుంచి మ‌రో సస్పెన్స్ థ్రిల‌ర్ ‘మిస్కిన్ సైకో’


నిత్యామీన‌న్‌, అదితీరావు హైద‌రి, ఉద‌య‌నిధి స్టాలిన్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘మిస్కిన్ సైకో’. డీఎస్ సినిమాస్ ప‌తాకంపై డి.శ్రీనివాస్ రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ‘పిశాచి’, ‘డిటెక్టివ్’ వంటి సూప‌ర్ హిట్ చిత్రాల‌ను ప్రేక్షకుల‌కు అందించిన ద‌ర్శకుడు మిస్కిన్ నుంచి వ‌స్తున్న మ‌రో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది. మ్యాస్ట్రో ఇళ‌యరాజా సంగీత సార‌థ్యం వ‌హించారు. సంక్రాంతి సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా నిర్మాత డి.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘వైవిధ్యమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆద‌రిస్తారు. కొత్తదనాన్ని కోరుకునే తెలుగు సినీ ప్రేక్షకుల కోసం ‘మిస్కిన్ సైకో’ చిత్రాన్ని థియేట‌ర్స్‌లోకి తీసుకువ‌స్తున్నాం. త్వర‌లోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం’’ అని అన్నారు. విశాల్ హీరోగా మిస్కిన్ దర్శకత్వంలో వచ్చిన ‘డిటెక్టివ్’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ‘తుప్పరివాలన్’గా తమిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘డిటెక్టివ్’గా అందించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘తుప్పరివాలన్ 2’ కూడా ప్రారంభమైంది. కొంత చిత్రీకరణ పూర్తిచేసిన తరవాత ఈ ప్రాజెక్ట్ నుంచి మిస్కిన్ అకస్మాత్తుగా తప్పుకున్నారు. దీంతో మిస్కిన్‌పై విశాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ లేఖ విడుదల చేశారు. ‘తుప్పరివాలన్ 2’కు తానే దర్శకత్వం వహిస్తానని విశాల్ ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న తరవాత ‘సైకో’ను మొదలుపెట్టారు మిస్కిన్.


By January 14, 2021 at 01:05PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/first-look-poster-of-mysskin-psycho-released/articleshow/80265030.cms

No comments