ఆ యాప్ ఓపెన్ చేశాడు.. రూ.లక్ష హాంఫట్.. కొత్తగూడెంలో నయా మోసం

ఆన్లైన్ నగదు లావాదేవీల యాప్ల విషయంలో అప్రమత్తంగా లేకపోతే సైబర్ మోసగాళ్లు ఎలా బురిడీ కొట్టిస్తారో తెలిపే సంఘటన ఇది. ఓ యువకుడి స్మార్ట్ఫోన్కు నకిలీ యాప్ నుంచి సందేశం పంపి ఏం జరిగిందో తెలుసుకునేలోపే రూ.లక్ష నగదు మాయం చేసేశారు సైబర్ కేటుగాళ్లు. భద్రాద్రి జిల్లా పాల్వంచకు చెందిన శ్రావణ్ శనివారం తన స్మార్ఫోన్లో నగదు ట్రాన్స్ఫర్ చేసే ఓ యాప్ను ఓపెన్ చేశాడు. అదే సమయంలో ‘క్యాష్బ్యాక్’ అంటూ ఫేక్ మెసేజ్ వచ్చింది. Also Read: దానిపై క్లిక్ చేయడంతో బ్యాంక్ అంకౌట్లో నుంచి రూ.499 విత్డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకునేందుకు యాప్ ప్రతినిధులను సంప్రదించేందుకు ప్రయత్నించాడు. ఇంతలో గుర్తుతెలియని నంబరు నుంచి ఫోన్ వచ్చింది. ‘మేం కోరిన వివరాలు యాప్లో నమోదు చేస్తే రూ.499లు 13వ తేదీలోగా తిరిగి డిపాజిట్ అవుతాయని అవతలి వ్యక్తి చెప్పాడు. Also Read: అతడి మాటలు నమ్మిన శ్రావణ్ అన్ని వివరాల యాప్లో నమోదు చేయగా.. అకౌంట్లో నుంచి రూ.99,500 మాయమయ్యాయి. దీంతో తాను సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నట్లు తెలుసుకున్న అతడు వెంటనే కొత్తగూడెం చేరుకుని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
By January 11, 2021 at 10:53AM
No comments