Breaking News

రాజస్థాన్‌లో చిక్కిన పాక్ గూఢచారి.. హనీట్రాప్‌లో పడి దేశానికి ద్రోహం


కరెన్సీ నోట్ల కోసం దేశ ద్రోహిగా మారిన భారతీయుడిని రాజస్థాన్‌‌ సీఐడీ (స్పెషల్ బ్రాంచ్) పోలీసులు అరెస్ట్ చేశారు. జైసల్మేర్ జిల్లా లతీ గ్రామానికి చెందిన చెందిన సత్యనారాయణ్ పలివాల్ (42) పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తుండగా పక్కా సమాచారంతో అరెస్టు చేశామని జైపూర్ పోలీసులు తెలిపారు. భారత సైన్యం, పోలీసుల సమాచారాన్ని సత్యనారాయణ్ పాకిస్థాన్‌కు చేరసినట్లు తమ విచారణలో వెల్లడైందని పేర్కొన్నారు. ఫోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్ వద్ద మూడు రోజుల క్రితం అనుమానాస్పదంగా సంచరిస్తున్న సత్యనారాయణ్‌ను నిఘా సంస్థలు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. రెండ్రోజుల విచారణ అనంతరం అతడు పాకిస్థా్న్‌కు గూఢచారిగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. సరిహద్దుల్లో భారత సైన్యం కదలికలు, ఫోఖ్రాన్ వద్ద సైన్యం చేపడుతున్న కార్యక్రమాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని అతడు సోషల్‌మీడియా ద్వారా ఐఎస్ఐకి చేరవేసినట్లు తెలుస్తోంది. సత్యనారాయణ్‌ని హనీట్రాప్ ద్వారా పాక్ సైన్యం వలలో వేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. దీనిపై ఇంటెలిజెన్స్ ఏడీజీ ఉమేష్ మిశ్రా మాట్లాడుతూ.. కొన్నాళ్ల క్రితం ఐఎస్ఐకి చెందిన ఓ మహిళా ఏజెంట్ సత్యనారాయణ్‌ని చద్దాం ప్రాంతంలో కలుసుకుంది. తాను భారతీయ విలేకరినని నమ్మించి ఆ ప్రాంతంలో జరిగే సంగతుల గురించి తనకు సమాచారం ఇవ్వాలని చెప్పి తన ఫోన్ నంబర్ ఇచ్చింది. అప్పుడప్పుడు అతడికి వీడియో కాల్ చేసి వలలో వేసుకుంది. దీంతో ఆమె కోరినట్లుగా ఫోఖ్రాన్ ప్రాంతంలో సైన్యం కదలికల గురించి సత్యనారాయణ్ ఎప్పటికప్పుడు ఆమెకు సమాచారం ఇచ్చేవాడు’ అని తెలిపారు. అఫీషియల్ సీక్రెట్ యాక్ట్, 1923 కింద అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనట్లు మిశ్రా తెలిపారు.


By January 11, 2021 at 10:26AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/rajasthan-man-arrested-on-chatges-of-spying-for-pakistan-due-to-honey-trapped-by-isi-agent/articleshow/80208047.cms

No comments