Breaking News

ఆహారం పెట్టలేదని పాలేరు ప్రాణం తీసిన శునకాలు, తమిళనాడులో ఘోరం


శునకాలంటే విశ్వాసానికి మారు పేరుగా భావిస్తారు. అలాంటి శునకాలే యమకింకరులై పాలేరు ప్రాణాలు తీసిన దారుణ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. జిల్లాలోపి వల్లంపడుగై గ్రామంలో నివాసముందే జీవనాథం అనే వ్యక్తి స్థానిక కాంగ్రెస్ నేత విజయ సుందరం వద్ద చాలాకాలంగా పనిచేస్తున్నాడు. జంతువులు వచ్చి పొలంలోని పంటను నాశనం కాకుండా చూసుకునేవాడు. ఈ క్రమంలోనే జీవనాథంకు తోడుగా ఉంటాయని యజమాని మూడేళ్ల క్రితం రెండు కుక్కలు కొనుగోలు చేశాడు. ఆ కుక్కలను సొంత మనుషుల్లా చూసుకునే జీవనాథం రోజూ వాటికి మంచి ఆహారం పెడుతూ మచ్చిక చేసుకున్నాడు. ఈ క్రమంలోనే రోజూ ఒకే సమయానికి ఆహారం తినడం అలవాటు చేసుకున్నాయి. అయితే మంగళవారం పొలంలో పని ఎక్కువ ఉండటంతో జీవనాథం ఆ కుక్కలకు ఆహారం పెట్టడం మరిచిపోయాడు. సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వెళ్లాక కుక్కలకు ఆహారం పెట్టలేదని గుర్తుకొచ్చి తిరిగి వెళ్లాడు. Also Read: అప్పటికే ఆకలితో అలమటిస్తున్న కుక్కలకు జీవనాథాన్ని చూడగానే పట్టరాని కోపం వచ్చింది. కట్లు విప్పగానే వేట కుక్కల్లా జీవనాథంపై పడి దాడి చేశాయి. వాటి బారి నుంచి తప్పించుకునేందుకు అతడు ప్రయత్నించినా వదల్లేదు. మొహంతో పాటు శరీరంలోని అనేక చోట్ల విచక్షణా రహితంగా దాడి చేయడంతో జీవనాథం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కుక్కలు రాట్‌వీలర్స్ జాతివని, వీటితో చాలా ప్రమాదకరమని జంతు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటికి కోపం చాలా ఎక్కువగా వస్తుందని, ఏ మాత్రం తేడా వచ్చినా ఇలాగే మనుషులపై పడి ప్రాణాలు తీస్తామని పేర్కొన్నారు. అందుకే ఈ జాతి కుక్కలను అమెరికా, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, పోర్చుగల్, రొమానియా, ఉక్రెయిన్, రష్యా, ఇజ్రాయిల్‌ దేశాల్లోని చాలా ప్రాంతాల్లో నిషేధించినట్లు తెలుస్తోంది.


By January 15, 2021 at 10:39AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/food-not-given-on-time-rottweilers-maul-man-to-death-in-tamil-nadu/articleshow/80279786.cms

No comments