Breaking News

బ్రిటిష్ కాలం నాటి ఆ రైలుకు నేతాజీ పేరు.. అంతా బెంగాల్ ఎన్నికల మహిమేనాా?


మరో మూడు నెలల్లో పశ్చిమ్ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా.. ఈసారి బెంగాల్ కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగా స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ జయంతిని పరాక్రమ్ దివస్‌గా ఇప్పటికే ప్రకటించింది. తాజాగా, 130 ఏళ్ల చరిత్ర కలిగిన కలకత్తా మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైలుకు సైతం ఆయన పేరును పెడుతున్నట్టు కేంద్రం తెలిపింది. ఈ మేరకు రైల్వే మంత్రి పియూష్ గోయల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘స్వాతంత్య్ర సంగ్రామంలో సుభాష్ చంద్రబోస్ జీ మరపురాని పోరాటానికి వందనం.. ఆయన జన్మదినం ఇప్పుడు పరాక్రమ్ దివాస్‌గా జరుపుకోనున్నాం... ఆయన జ్ఞాపకార్థం నేతాజీ ఎక్స్‌ప్రెస్ పేరుతో హౌరా-కల్కా మెయిల్‌ను నడపాలని భారత రైల్వే నిర్ణయించింది’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. స్వాతంత్రానికి పూర్వమే కల్కా మెయిల్‌ను బ్రిటిష్ కాలంలో ప్రారంభమయ్యింది. 1966లో కోల్‌కతా (అప్పటి కలకత్తా) ఢిల్లీ మధ్య ‘ఈస్ట్ ఇండియన్ రైల్వే మెయిల్’గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ మార్గం 1891లో ఢిల్లీ నుంచి కల్కా వరకు విస్తరించారు. బ్రిటిషర్లు వేసవి రాజధాని సిమ్లాకు బ్రిటిషర్లు తమ ప్రజలు, ఉద్యోగులను తరలించడానికి ఈ రైలును వినియోగించింది. ఈ రైలు నెంబర్లను 90వ దశకంలో మార్చారు. దర్శకుడు సత్యజిత్ రే రచనలతో సహా ప్రసిద్ధ సంస్కృతిలో గణనీయమైన గుర్తింపు పొందిన ఈ రైలు, నేతాజీ వీరోచిత పోరాటాలలో కూడా కీలక భూమిక పోషించింది. రెండో ప్రపంచ యుద్ధం, 1941లో గృహనిర్బంధం సమయంలో జనవరి 17న నేతాజీ తన ఇంటి నుంచి తప్పించుకుని కారులో ఝార్ఖండ్ చేరుకుని, తర్వాత కల్కా మెయిల్‌లో పెషావర్‌కు ప్రయాణించారు. పెషార్ నుంచి అఫ్గానిస్థాన్‌ మీదుగా సోవియట్ యూనియన్, జర్మనీ, జపాన్ చేరుకుని ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించారు. చివరిగా బర్మా సరిహద్దుల్లో బ్రిటిష్ సైన్యంతో పోరాటం సాగించారు.


By January 23, 2021 at 10:33AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/historic-kalka-mail-train-renamed-to-honour-netaji-ahead-of-birth-anniversary/articleshow/80418064.cms

No comments