Breaking News

ఐదేళ్లు సహజీవనం.. యువతిని చంపి శవాన్ని ఇంటి గోడలోనే సమాధిచేశాడు!


ఓ మహిళతో ఐదేళ్లు సహజీవనం చేసిన యువకుడు, ఆమెపై మోజు తీరిపోవడంతో చివరకు అడ్డు తొలగించుకోడానికి పథకం వేశాడు. తనను పెళ్లిచేసుకోవాలని బాధితురాలు ఒత్తిడి చేయడంతో పథకం ప్రకారం హత్య చేశాడు. అనంతరం ఆమె శవాన్ని తన ఫ్లాట్ గోడల్లో దాచిపెట్టాడు. గతేడాది అక్టోబరులో జరిగిన ఈ హత్యోందతం దాదాపు మూడు నెలల తర్వాత వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘార్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాల్ఘార్ జిల్లాకు చెందిన నిందితుడు (30) ఓ మహిళ (32)తో ఐదేళ్లు సహజీవనం చేశాడు. పెళ్లి చేసుకుందామని ఆమె ఒత్తిడి చేయడంతో ఎలాగైనా వదిలించుకోవాలని ప్లాన్ చేశాడు. తాము ఉంటోన్న ఫ్లాట్‌లోనే హత్యచేసి, గోడల్లోనే శవాన్ని దాచిపెట్టాడు. చివరిసారిగా గతేడాది అక్టోబరు 21న నిందితుడితో కలిసి హతురాలు కనిపించిందని వెల్లడించారు. తమ కుమార్తె కోసం హతురాలు కుటుంబం అడిగితే గుజరాత్‌లోని వాపీకి వెళ్లిందని అబద్దం చెప్పాడు. అయితే, చాలా రోజులు గడిచిపోయినా ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఆశ్రయించారు. కేసు నమోదుచేసిన పోలీసులు.. తమదైన శైలిలో విచారించేసరికి వాస్తవాలు బయటకు వచ్చాయి. ఆమెను హత్యచేసి తన ఫ్లాట్‌ గోడల్లో సమాధిచేసినట్టు అంగీకరించాడు. అతడు చెప్పిన వివరాల ఆధారంగా గోడను తవ్విన పోలీసులు.. అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్‌లోని హత్యా నేరం, సాక్ష్యాలను ధ్వంసం చేసిన నేరాల కింద కేసులు నమోదుచేశారు.


By January 16, 2021 at 01:36PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-kills-girlfriend-hides-her-body-in-walls-of-flat-in-maharashtra/articleshow/80299934.cms

No comments