Breaking News

పుణ్యస్నానానికి వెళ్లిన యువతిని లాక్కెళ్లి పైశాచికం.. మకర సంక్రాంతి రోజు దారుణం


సంక్రాంతి పండగ వేళ ఒడిశాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మకర సంక్రాంతి సందర్భంగా నదిలో పుణ్యస్నానం చేసేందుకు వెళ్లిన యువతిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన గురువారం ఉదయం మయూర్‌భంజ్ జిల్లా బారిపాడ జరిగింది. పట్టణానికి చెందిన ఇద్దరు యువతులు గురువారం ఉదయం పుణ్యస్నానం చేసేందుకు నది ఒడ్డుకు వెళ్లారు. ఓ యువతి స్నానం చేస్తుండగా మరో యువతి ఒడ్డును ఒంటరిగా నిల్చుని ఉంది. ఆమెను గమనించిన అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు యువతిని నిర్మానుష్య ప్రాంతానికి ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో నిందితులిద్దరూ పరారయ్యారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బారిపాడ పోలీసులు నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం పీఆర్ఎం మెడికల్ కాలేజీకి తరలించారు.


By January 15, 2021 at 07:58AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-woman-allegedly-gang-raped-by-two-persons-while-she-was-going-to-take-a-holy-dip-on-the-occasion-of-makar-sankranti-in-baripada-town/articleshow/80277817.cms

No comments