Breaking News

రేపే వ్యాక్సినేషన్‌కు శ్రీకారం: 18 ఏళ్లు దాటితేనే టీకా, అలాంటి వారికి వేయొద్దు.. కేంద్రం కీలక సూచనలు


దేశవ్యాప్తంగా శనివారం (జనవరి 16) వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుండగా.. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో చేయాల్సిన, చేయకూడని అంశాల గురించి స్పష్టత నిచ్చింది. కేవలం 18 ఏళ్లు నిండిన వ్యక్తులకే టీకా ఇవ్వాలని పేర్కొంది. గర్భిణీలు, బాలింతలు, గర్భధారణ కోసం ఎదురుచూస్తున్న మహిళలకు టీకా వేయరాదని స్పష్టం చేసింది. తొలి డోసు ఎక్కడ తీసుకున్నారో.. రెండో డోస్ అదే కేంద్రంలో వేయించుకోవాలని, పరస్పరమార్పిడి కుదరదని సూచించింది. డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతించిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ కోవిషీల్డ్, భారత్ బయోటెక్ కొవాగ్జిన్ టీకా రెండు డోస్‌లకు మధ్య 28 రోజుల విరామం ఉండాలని పేర్కొంది. కరోనా సోకిన వ్యక్తులకు కూడా ఇదే నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్న రోగులు.. ప్లాస్మా థెరపీ చేయించుకున్నవారు..అనారోగ్యం, ఇతర కారణాల వల్ల ఆసుపత్రిలో ఉన్నవారు కోలుకున్న తర్వాత నాలుగు నుంచి ఎనిమిది వారాల వరకు టీకాలు వాయిదా వేయాల్సి ఉంటుందని అన్నారు. జనవరి 16న దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ మొదలుకానుంది. ఈ కార్యక్రమాన్ని ఆన్‌లైన్ ద్వారా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా 3,006 ప్రాంతాల్లో టీకా పంపిణీ చేస్తారు. తొలిరోజు ఒక్కో కేంద్రంలో వంద మందికి వ్యాక్సిన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో ప్రభుత్వ, ప్రైవేట్ హెల్త్ వర్కర్స్, ఐసీడీఎస్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. కొవిన్ యాప్ ద్వారా దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ పరిశీలన జరగనుంది. ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అధికారులు పర్యవేక్షించనున్నారు. నిరంతర ప్రక్రియకు కేంద్రం ప్రత్యేక కాల్‌సెంటర్ ఏర్పాటు చేసింది. తొలి దశలో మూడు కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకా ఇవ్వనున్నారు.


By January 15, 2021 at 07:54AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/centre-circulated-the-dos-and-donts-for-vaccination-to-the-states/articleshow/80277856.cms

No comments