పదేళ్లుగా తల్లి శవంతోనే మహిళ.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు!
ఓ మహిళ తన తల్లి శవంతోనే పదేళ్లుగా సహజీవనం సాగిస్తున్న ఘటన తాజాగా జపాన్లో వెలుగులోకి వచ్చింది. తన అపార్ట్మెంట్లోని ఫ్రీజర్లో ఒక దశాబ్దం నుంచి ఆమె శవాన్ని దాచిపెట్టినట్లు శనివారం పోలీసులకు తెలిపింది. తన తల్లి చనిపోయినట్టు తెలిస్తే శవాన్ని తీసుకెళ్లిపోతారని భయపడినట్టు పేర్కొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టోక్యోలోని (48) అనే మహిళ అపార్ట్మెంట్లో మృతదేహాన్ని దాచి ఉంచిందనే అనుమానంతో బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఇంటిలోని ఫ్రీజర్లో ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించామని తెలిపారు. ‘ఈ మృతదేహం పదేళ్ల కిందట చనిపోయిన నా తల్లిది..అప్పటి నుంచి ఫ్రీజర్లోనే భద్రపరిచాను.. ఎందుకంటే తల్లి శవాన్ని ఇంటి నుంచి తీసుకెళ్లడం తనకు ఇష్టం లేదు.. ఆమె నాతోనే ఉండాలనే భావనతో చనిపోయిన తర్వాత భద్రపరిచాను’ అని యోషినో పేర్కొన్నట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి. చనిపోయేటప్పటికి ఆమె వయసు 60 ఏళ్లు ఉండగా, మున్సిపల్ హౌసింగ్ కాంప్లెక్స్ అపార్ట్మెంట్ ఆమె లీజుకు తీసుకుంది. తల్లి ఎలా చనిపోయిందో మాత్రం ఆ మహిళ వెల్లడించలేదు. అద్దె చెల్లించకపోవడంతో యోషినోను జనవరి మధ్యలో బలవంతంగా అపార్ట్మెంట్ ఖాళీ చేయించినట్టు స్థానిక మీడియా తెలిపింది. అపార్ట్మెంట్ను శుభ్రంచేస్తున్న వ్యక్తి ఫ్రీజర్లో ఓ మృతదేహం ఉన్నట్టు గుర్తించాడని పేర్కొంది. ఈ విషయం పోలీసులు, అధికారులకు తెలియజేయడంతో యోషినో కోసం గాలించారు. ఎట్టకేలకు బుధవారం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దానిని పోస్ట్మార్టం కోసం తరలించారు. అయితే, ఆమె మరణానికి కారణాలు, సమయం గురించి పోస్ట్మార్టం నివేదికలో కచ్చితమైన ఆధారాలు లభించలేదని మీడియా తెలిపింది.
By January 30, 2021 at 02:13PM
No comments