Breaking News

ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 13 మంది వలసకూలీలు మృతి


ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా 13 మంది వలసకూలీల బతుకులు నిద్రలోనే తెల్లారిపోయాయి. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న కూలీలపైకి ట్రక్కు దూసుకెళ్లి 13 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన గుజరాత్‌లో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సూరత్‌లోని కొసంబా వద్ద ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న కూలీలపైకి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదం మృతులను రాజస్థాన్‌కు చెందిన వలసకూలీలుగా గుర్తించారు. ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో పదమూడేళ్ల చిన్నారి కూడా ఉండటం బాధాకరం. ఈ ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 8 మంది గాయపడ్డారు. ఘటనాస్థలిలోనే 12 మంది మృతిచెందారు. క్షతగాాత్రులను చికిత్స కోసం స్చిమియర్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. పెద్ద సంఖ్యలో అంబులెన్స్‌లు, పోలీస్ కాన్వాయ్, అధికారులు చేరుకున్నారు. కేసు నమోదుచేసిన పోలీసులు లారీ డ్రైవర్, క్లీనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు.


By January 19, 2021 at 07:47AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/gujrat-13-migrants-sleeping-on-footpath-run-over-by-truck-in-surat/articleshow/80338863.cms

No comments