Breaking News

Poonam Kaur: అవును.. వాటి వల్లే బలయ్యాను! పవన్ కళ్యాణ్ ఇష్యూ లాగుతూ పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు


రీసెంట్‌గా జరిగిన జీహెచ్ఎంసి ఎన్నికల్లో జనసేన తరఫున పవర్ స్టార్ తీసుకున్న నిర్ణయాలపై పెద్ద చర్చే నడించింది. ముందుగా ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించిన ఆయన.. ఆ తర్వాత అనూహ్యంగా తన నిర్ణయాన్ని మార్చుకోవడం పట్ల ఘాటుగా రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ స్టాండ్‌పై, మాటలు మార్చే విధానంపై ప్రకాష్ రాజ్ సెన్సేషనల్ కామెంట్స్ చేయడంతో అటు మీడియాలో, ఇటు జనాల్లో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే దీనిపై శ్రీ రెడ్డి రియాక్ట్ కాగా, తాజాగా తన స్పందన తెలుపుతూ మీడియాపై మండిపడింది సినీ నటి . ప్రస్తుతం కేంద్రం తీసుకురాబోతోన్న వ్యవసాయ చట్టాలపై రైతులు ఢిల్లీలో నిరసన తెలుపుతున్న నేపథ్యంలో గత కొన్ని రోజులుగా రైతుల ధర్నాలు, ఆందోళనలు చూస్తూనే ఉన్నాం. దీంతో రైతులకు మద్దతుగా ప్రకాష్ రాజ్ ఓ ట్వీట్ చేయగా అది బాగా వైరల్ అయింది. కాకపోతే దానిపై మీడియా ఫోకస్ పెద్దగా కనిపించకపోవడంతో ఈ అంశాన్నే ఆధారంగా తీసుకొని పవన్ కళ్యాణ్ జోలీ తీస్తూ మీడియాపై షాకింగ్ కామెంట్స్ చేసింది పూనమ్. Also Read: ఓ పొలిటిషన్, ఫేమస్ హీరోపై ప్రకాష్ రాజ్ కామెంట్స్ చేస్తే మీడియాలో పదే పదే వేస్తూ ఇష్యూని జనాల్లోకి తీసుకెళ్లారు. ఇప్పుడు అదే ప్రకాష్ రాజ్ రైతు సమస్యలపై ట్వీట్ చేస్తే ఏ మీడియా పట్టించుకోవడం లేదంటూ లాజిక్ అప్లై చేసి మీడియాపై సెటైర్స్ వేసింది పూనమ్. దీంతో ఆమె ట్వీట్ చూసిన ప్రకాష్ రాజ్.. ప్రతి మీడియా సంస్థకు వారి వారి సొంత ఎజెండాలు ఉంటాయని కామెంట్ చేయడంతో మరో అడుగు ముందుకేసింది పూనమ్. 'అవును సర్.. అలాంటి ఎజెండాల వల్లనే నేను బలయ్యాను' అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. రైతులు, సైనికులు మన దేశానికి వెన్నుముక.. వాళ్లు కార్పొరేటర్లు కాదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.


By December 07, 2020 at 01:41PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/poonam-kaur-sensational-comments-on-prakash-raj-and-pawan-kalyan-issue/articleshow/79604825.cms

No comments