Breaking News

కొత్తకోడలిని తీసుకెళ్లేందుకు వచ్చిన ప్రియుడు.. చివరికి..


మనసారా ప్రేమించిన ప్రియురాలికి పెళ్లైపోయింది. అది తట్టుకోలేని ప్రియుడు ఆమెను తీసుకుని వెళ్లిపోవాలని ప్లాన్ వేశాడు. తన స్నేహితులతో కలిసి ఏకంగా ఆమె అత్తింటికి వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన యూపీలోని డియోరియా జిల్లాలో జరిగింది. సరిహద్దు బిహార్‌లోని శివన్‌కి చెందిన పంకజ్ మిశ్రా(25) అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. అయితే ఆమెకు ఈ నెల 8న డియోరియా జిల్లాకి చెందిన వికాస్ పాండేతో వివాహం జరిగింది. ప్రియురాలికి పెళ్లైపోవడంతో తట్టుకోలేకపోయిన పంకజ్.. ఆమెను ఎలాగైనా తీసుకెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. అర్ధరాత్రి వేళ తన స్నేహితులతో కలసి ఆమె అత్తింటికి వెళ్లాడు. కొత్త కోడలిని తీసుకెళ్లేందుకు వచ్చిన యువకులను చూసి ఆమె భర్త, మామ అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య గొడవ జరగడంతో భర్త వికాస్ పాండే, మామ జితేంద్ర పాండేకి గాయాలయ్యాయి. ఆ విషయం గ్రామస్తులకు తెలియడంతో వెంటనే పంకజ్‌ మిశ్రాని చుట్టుముట్టారు. స్థానికులు చావబాదడంతో ప్రియుడు పంకజ్ తీవ్రగాయాలపాలయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పంకజ్‌ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పంకజ్ ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read:


By December 25, 2020 at 12:09PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/youth-beaten-to-death-for-trying-to-take-newlywed-lover-in-uttar-pradesh/articleshow/79952181.cms

No comments