రజినీకాంత్ పార్టీ పేరు అదేనా?.. గుర్తు కేటాయించిన ఈసీ
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiznnF_dSNJNvA7yvMGlS2F8Mp5p3q7_b2yjJ-12wu0tJ_HB8Frugro8tY7agbK2o40802tzyVnkF7SLEmUEF0SRc3h4PFPyKfHtXXVQw_fa3WMWAne87UyT4uozsGJ74M24g_TnYYg4Wc/s320/Movie.jpg)
![](https://telugu.samayam.com/photo/79735020/photo-79735020.jpg)
సూపర్ స్టార్ పార్టీ పేరు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దీంతో పాటు పార్టీకి సంబంధించి గుర్తు కూడా ఖరారైనట్లు సమాచారం అందుతోంది. ‘మక్కల్ సేవై కర్చీ'(ప్రజాసేవ పార్టీ) అనే పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. పార్టీ గుర్తుగా ఆటోను కేంద్ర ఎన్నికల కమిషన్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తాను డిసెంబర్ 31న కొత్త రాజకీయ పార్టీ ప్రారంభిస్తున్నట్లు రజినీకాంత్ కొద్దిరోజుల క్రితమే ప్రకటించారు. ఆ పార్టీకి చీఫ్ కో-ఆర్డినేటర్గా అర్జున మూర్తిని, సూపర్ వైజర్గా తమిళ్రూవి మణియన్ను నియమించినట్లు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రజినీ పార్టీ 234 నియోజకవర్గాల్లో పోటీచేసే అవకాశముంది. తన పార్టీకి గుర్తుగా ‘బాబా’ లోగోను ఇవ్వాల్సిందిగా రజినీకాంత్ ఎన్నికల సంఘాన్ని కోరగా నిరాకరించింది. చివరికి ఆటో గుర్తును కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. డిసెంబర్ 31 రజినీకాంత్ తన పార్టీ పేరును అధికారికంగా ప్రకటించనున్నారు.
By December 15, 2020 at 11:59AM
No comments