Breaking News

కరోనా వైరస్‌తో కన్నుమూసిన ఎస్వితిని ప్రధాని ఆంబ్రోస్


ఆఫ్రికా ఖండంలోని ఎస్వతిని దేశ ప్రధానమంత్రి అంబ్రోస్ మండ్వూలో డ్లమిని (52) కోవిడ్-19కు చికిత్స పొందుతూ కన్నుమూశారు. అతి చిన్న దేశమైన ఎస్వతినిలో సంపూర్ణ రాచరిక ప్రభుత్వం అధికారంలో ఉంది. నాలుగు వారాల కిందట బారినపడ్డ ప్రధాని అంబ్రోస్ డ్లమిని చికిత్స కోసం దక్షిణాఫ్రికాలోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడే చికిత్స పొందుతూ మరణించారని ఎస్వతిని ఉప ప్రధాని తెంబా మసుకు తెలిపారు. కరోనాకు మెరుగైన చికిత్స కోసం అంబ్రోస్ ను దక్షిణాఫ్రికాకు తరలించినా, ఫలితం లేకపోయిందని తెంబా ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్వతిని ప్రధానిగా అంబ్రోస్ 2018 నవంబరులో నియమితులయ్యారు. అదే ఏడాది పోలాండులోని కటోవిస్ నగరంలో జరిగిన ప్రపంచ దేశాల సదస్సులో వాతావరణ మార్పులపై అంబ్రోస్ డ్లమిని ప్రసంగించారు. ప్రధాని కాక ముందు బ్యాంకింగ్ రంగంలో 18 ఏళ్లు పనిచేసిన ఆంబ్రోస్.. ఎస్వతిని నెడ్‌బ్యాంక్ లిమిటెడ్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. కరోనా వైరస్ సోకిన తర్వాత కొద్ది రోజులు ఎస్వతినిలోనే ప్రధానికి చికిత్స చేశారు. అయితే, ఆయన ఆరోగ్యం మెరుగుపడటకపోవడంతో పొరుగున ఉన్న దక్షిణాఫ్రికాకు డిసెంబరు 1న తరలించారు. అక్కడ ఆస్పత్రిలో చేరిన తర్వాత చికిత్సకు స్పందిస్తూ కోలుకున్నట్టు కనిపించారు. అయితే, రెండు రోజుల కిందట ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించడంతో ఐసీయూలో చికిత్స కొనసాగించారు. ఆంబ్రోస్‌ను కాపాడటానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆదివారం కన్నుమూశారు. మొత్తం 1.2 మిలియన్ల జనాభా ఉన్న ఎస్వతినిలో ఇప్పటి వరకు 6,768 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. ఇప్పటి వరకు 127 మంది ప్రాణాలు కోల్పోయినట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.


By December 14, 2020 at 08:08AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/eswatini-prime-minister-ambrose-dlamini-passed-away-due-to-coronavirus/articleshow/79713410.cms

No comments