Breaking News

మోదీ గడ్డం వెనుక అసలు కారణం అదేనా.. మరో మూడున్నరేళ్లు జుట్టు కత్తిరించుకోరా?


దేశంలో కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్‌డౌన్ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ గడ్డం, జుట్టు కత్తిరించలేదు. దాదాపు పది నెలలుగా ఆయన గడ్డం, జుట్టు కత్తిరించకపోవడానికి కారణం ఏంటో స్పష్టంగా తెలియరాలేదు. అయితే, ప్రధాని గడ్డం వెనుక రామమందిరం ఉందని ఉడుపి పెజావర పీఠాధిపతి స్వామి విశ్వప్రసన్న తీర్థ పేర్కొన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధాని భూమి పూజ చేశారని, పూర్తి చేసే బాధ్యతను కలిగి ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. స్వామి విశ్వప్రసన్నతీర్థ అయోధ్య రామమందిర ట్రస్ట్ బోర్డులోని సభ్యుడిగా ఉన్నారు. కర్ణాటకలోని బాగల్‌కోట్‌లో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఇటువంటి చరిత్రాత్మక నిర్మాణాలు చేపట్టే సమయంలో సంకల్పం చేసుకుని కేశాలను తొలగించరని, మోదీ గడ్డం, జుట్టు కత్తిరించకపోవడానికి ఇదే కారణమై ఉండొచ్చుని ఆయన పేర్కొన్నారు. ‘ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేయడమే కాకుండా.. దాని నిర్మాణానికి భరోసా ఇచ్చే పూర్తి బాధ్యత ప్రధాని మోదీ తీసుకున్నారు.. ఆచారం ప్రకారం సహజంగా ప్రకారం ఏదైనా సంకల్పం చేసేటప్పుడు వారి జుట్టును కత్తిరించకూడదు.. మోదీ (పొడవాటి) జుట్టుకు అది కారణం కావచ్చు’ అన్నారు. రామమందిర నిర్మాణ ప్రాజెక్టు మొత్తం పూర్తికావడానికి మూడున్నరేళ్లు పడుతుందని అంచనా వేశారు. ఆలయ నిర్మాణ ప్రాజెక్టు రూ.1,500 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేశామని పేర్కొన్నారు. ఇందులో రూ.500 కోట్ల ఆలయం కోసం, మిగతా మొత్తంతో చుట్టుపక్కల ఇతర అభివృద్ధి పనులను నిర్వహిస్తామన్నారు. కాగా, విశిష్టాద్వైత సిద్ధాంత కర్త మద్వాచార్యులు నెలకొల్పిన ఎనిమిది మఠాల్లో పెజావర్ ఒకటి. విశ్వప్రసన్నతీర్థ కంటే ముందు ఈ పీఠాధిపతిగా ఉన్న స్వామి విశ్వేవ తీర్థ‌ను మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్, మాజీ సీఎం ఉమాభారతి తదితరులకు ఆధ్యాత్మిక గురువు.


By December 28, 2020 at 08:07AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pejawara-seer-vishwaprasanna-has-a-theory-about-pm-modi-growing-beard-hair/articleshow/79984764.cms

No comments