Breaking News

మద్రాస్ హైకోర్టులో అరుదైన ఘట్టం.. జడ్జ్‌లుగా భార్యాభర్తలు ఒకే రోజు ప్రమాణం


భార్యాభర్తలు ఒకే రోజు న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేసిన అరుదైన ఘట్టానికి వేదికగా నిలిచింది. ఇలా ఒకే రోజు భార్యాభర్తలు న్యాయమూర్తులుగా ప్రమాణం చేయడం న్యాయవ్యవస్థలో అరుదుగా జరుగుతుంది. జస్టిస్‌ మురళీశంకర్‌ కుప్పురాజు, జస్టిస్‌ తమిళ్‌సెల్వి టి.వలాయపలయం దంపతులు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అడ్వకేట్‌ జనరల్‌ విజయ్‌ నారాయణ్‌ మాట్లాడుతూ వారు ‘న్యాయచరిత్ర’ సృష్టించారని వ్యాఖ్యానించారు. వీరితోపాటు మరో ఎనిమిది మంది న్యాయమూర్తులుగా గురువారం ప్రమాణం చేశారు. భార్యభర్తలు ఒకేరోజు జడ్జ్‌లుగా ప్రమాణస్వీకారం చేయడం మద్రాస్ హైకోర్టు చరిత్రలో తొలిసారని వ్యాఖ్యానించారు. కాగా, 2019 నవంబరులో పంజాబ్‌ హైకోర్టులో జస్టిస్‌ వివేక్‌ పూరి, జస్టిస్‌ అర్చనా పూరి దంపతులు న్యాయమూర్తులుగా ఒకే రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఆ ప్రత్యేకత చాటుకున్న జంట వీరిదే అని ఏజీ విజయ్‌ నారాయణ్‌ తెలిపారు. జస్టిస్ మురళీశంకర్, జస్టిస్ తమిళ్‌సెల్వీలతోపాటు జిల్లాజడ్జీలుగా పనిచేసిన మరో ఎనిమిది మంది కూడా గురువారం హైకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు. జస్టిస్‌ జి.చంద్రశేఖరన్‌, జస్టిస్‌ ఏఏ నక్కీరన్‌, జస్టిస్‌ శివజ్ఞానం, జస్టిస్‌ జి.ఇళంగోవన్‌, జస్టిస్‌ ఎస్‌.ఆనంది, జస్టిస్‌ ఎస్‌.కన్నమ్మాల్‌, జస్టిస్‌ ఎల్‌.సతీష్‌కుమార్‌, జస్టిస్‌ ఆర్‌ఎన్‌ మంజులతో మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సాహి ప్రమాణస్వీకారం చేయించారు.


By December 04, 2020 at 07:17AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/husband-wife-sworn-in-as-madras-high-court-judges-on-same-day/articleshow/79557449.cms

No comments