Breaking News

జగిత్యాల యాసిడ్ దాడి కేసులో షాకింగ్.. పది వేలకి మర్డర్.!


జగిత్యాలలో యువతిపై కేసును పోలీసులు ఛేదించారు. తనతో సన్నిహితంగా ఉంటూ మరొకరితో ఫోన్‌లో మాట్లాడుతోందన్న అనుమానంతో అంతమొందించేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసులు తేల్చారు. అందుకోసం సుపారీ కూడా ఇచ్చినట్లు తేలింది. నిందితులను అరెస్టు చేసిన అనంతరం జిల్లా ఎస్పీ సింధు శర్మ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. జిల్లా ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామానికి చెందిన యువతి(22) భర్త ఇటీవల మరణించాడు. ఆమెకు అదే గ్రామానికి చెందిన గజేందర్‌తో పరిచయమైంది. తనతో సన్నిహితంగా ఉంటూనే మరికొందరితో ఫోన్‌లో మాట్లాడుతోందని అనుమానం పెంచుకున్న గజేందర్ ఆమెను హతమార్చాలని పథకం రచించాడు. డబ్బా గ్రామానికి చెందిన దినేశ్, అమ్మక్కపేటకు చెందిన ప్రకాశ్‌తో రూ.10 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందులో భాగంగా రూ.5 వేలు అడ్వాన్స్‌ కూడా ఇచ్చాడు. ఈ నెల 23న గజేందర్ తన చెల్లెళ్లు, యువతితో కలిసి మెట్‌పల్లిలో షాపింగ్ చేశాడు. అనంతరం కారులో ఎక్కించుకుని యువతిని తిమ్మాపూర్ తండాలో దించాడు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న ప్రకాశ్ యువతిపై యాసిడ్ పోసి దినేశ్ బైక్‌పై పరారయ్యాడు. మెట్‌పల్లిలోని బ్యాటరీల దుకాణంలో యాసిడ్ కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు గజేందర్, దినేశ్, ప్రకాశ్‌లను అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. Also Read:


By December 26, 2020 at 11:02AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/police-cracks-jagtial-acid-attack-three-arrested/articleshow/79963485.cms

No comments