Breaking News

కోడి పుంజులతో ఈత కొట్టించి.. నీటమునిగిన యువకుడు.. షాకింగ్


స్నేహితులతో సరదాగా కోడిపుంజులు తీసుకుని బావి వద్దకు వెళ్లాడు. వాటితో ఈత కొట్టించి సరదా తీర్చుకున్నాడు. తీరా తాను సెల్ఫీ తీసుకుందామని ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయాడు. నానమ్మ కర్రక్రియల కోసం వచ్చిన మనవడు ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటన చిత్తూరులో జిల్లా పలమనేరులో జరిగింది. తమిళనాడులో తిరపత్తూరుకు చెందిన సాదిక్ కుమారుడు ముజిసిర్(17) ఇంటర్ చదువుతున్నాడు. పట్టనంలోని జెండామఠం ప్రాంతంలో నివాసముండే నానమ్మ కర్మక్రియల కోసం మూడు రోజుల కిందట వచ్చాడు. నానమ్మ అంతిమ సంస్కారాలు ఆదివారం ముగిశాయి. మరుసటి రోజు తన స్నేహితులతో కలసి కోడిపుంజులు తీసుకుని సరదాగా చెరువు కట్టకింద సమీపంలోని ఓ వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. తనకు ఈత రాకపోవడంతో బావిగట్టుపైనే కూర్చున్నాడు. కొద్దిసేపు కోడిపుంజులతో ఈత కొట్టించి సరదా తీర్చుకున్నాడు. తీరా ఇంటికెళ్లే సమయంలో సెల్ఫీ తీసుకోవాలన్న కోరిక అతడి ప్రాణాలను బలిగొంది. బావి ఒడ్డుపై నిల్చుని సెల్ఫీ తీసుకుంటూ పట్టుతప్పి బావిలో పడిపోయాడు. అతని స్నేహితులు రక్షించే ప్రయత్నం చేసినా అప్పటికే నీటిమునిగాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది స్పాట్‌కి చేరుకుని యువకుడి మృతదేహాన్ని వెలికితీయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By December 22, 2020 at 10:40AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/teenager-drowns-in-well-in-chittoor-dies/articleshow/79851509.cms

No comments