Breaking News

డ్రైవర్ నిద్రమత్తు.. చెట్టును ఢీకొట్టిన ఎస్‌యూవీ.. నలుగురు మృతి


ఒడిశాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కేంఝూర్ జిల్లా పండాపొడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమగిరి వద్ద వేగంగా వస్తున్న ఓ వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ జీపులోని ప్రయాణిస్తున్న నలుగురు మృతిచెందగా మరో నలుగురు గాయపడ్డారు. మృతులు ఒడిశాలోని మయూర్బంజ్ జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన ఎస్‌యూవీలో 11 మంది హరిచందన్‌పూర్ సమీపంలోని జిరాంగ్ నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వాహనం అదుపుతప్పి రోడ్డుపై బోల్తాపడి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఘటనాస్థలిలోనే నలుగురు ప్రానాలు కోల్పోగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మటా నాయిక్, సురేంద్ర మరాండీ, రేవతీ రాజ్, ఎస్కే కమర్‌‌లుగా గుర్తించారు. మృతుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రమాదం జరిగిన వెంటన స్థానికులు స్పందించిన 108కి సమాచారం అందజేశారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లో కేంఝార్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. జిల్లా అత్యవసర మెడికల్ అధికారి మాట్లాడుతూ.. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో క్షతగాత్రులు ఆస్పత్రికి చేరుకోగా.. వెంటనే వారికి చికిత్స ప్రారంభించాం.. వీరిలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి, తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తర్వాత నాలుగు మృతదేహాలు పోస్ట్‌మార్టం కోసం వచ్చాయి’ అన్నారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్టు ఓ బాధితుడు తెలిపారు. వాహనంలో ప్రయాణిస్తున్న వారంతా మయూర్భంజ్ జిల్లా హతాబదాలాకు చెందినవారిగా గుర్తించారు.


By December 31, 2020 at 08:45AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/four-killed-4-others-injured-after-suv-overturns-in-keonjhar-in-odisha/articleshow/80038959.cms

No comments