Breaking News

మహిళపై అత్యాచారం.. చనిపోయిన యువకుడు.. షాకింగ్


లిఫ్ట్ అడగడమే ఆమె పాలిట శాపమైంది. నమ్మకంగా బైక్ ఎక్కించుకెళ్లిన యువకుడు ఆమెపై నీచానికి పాల్పడ్డాడు. నిర్మానుష్య ప్రాంతంలో వదిలేసి పరారయ్యాడు. ఎలాగో ఇంటికి చేరిన మహిళ ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించడంతో యువకుడి వెన్నులో వణుకు మొదలైంది. పోలీసులు గ్రామానికి వస్తున్నారని తెలిసి భయంతో ప్రాణాలు తీసుకున్నాడు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తలకొండపల్లి మండలం పెద్దూర్ తండాకి చెందిన శంకర్(22) బోరు మెకానిక్‌గా పనిచేసేవాడు. రెండు రోజుల కిందట శంకర్ బైక్‌పై ఆమనగల్లు వైపు వెళ్తుండగా చీపునుంతల శివారు ప్రాంతంలో ఓ వివాహిత మహిళ లిఫ్ట్ అడిగింది. ఆమెపై కన్నేసిన శంకర్ నమ్మకంగా బైక్‌ ఎక్కించుకున్నాడు. మార్గం మధ్యలో చుక్కాపూర్ శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి నీచానికి పాల్పడ్డాడు. ఆమెను బెదిరించి దారుణంగా అత్యాచారం చేశాడు. ఆమెను అక్కడే వదిలేసి పరారవడంతో ఎలాగో ఇంటికి చేరిన బాధితురాలు వెంటనే పోలీసులను ఆశ్రయించింది. లిఫ్ట్ అడిగినందుకు బైక్ ఎక్కించుకెళ్లి అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలితో సహా పోలీసులు తండాకి వస్తున్నారని తెలుసుకున్న శంకర్ భయాందోళనకు గురయ్యాడు. అత్యాచారం కేసులో అరెస్టు చేస్తారన్న భయంతో తండా శివారులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read:


By December 31, 2020 at 10:57AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-man-kills-self-after-raping-married-woman-in-rangareddy/articleshow/80040607.cms

No comments